
మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో 51 శాతం విదేశీ పెట్టుబడికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇలాంటి రిటైల్ సంస్దల కార్యకలాపాలను అనుమతించే విషయంలో అధికారాన్ని మాత్రం రాష్టాలకే కట్టబెట్టింది. వీటితో పాటు సింగిల్ బ్రాండ్ రిటైల్ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ సంస్దలు విక్రయించే వస్తువుల్లో 30 శాతం దేశీయంగా సమీకరించాలనే నిబంధనకు మినహాయింపు కల్పించింది. ప్రభుత్వం కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ సంస్దలు నేరుగా స్దానిక సంస్దలతో కలిసి మన దేశంలోకి ప్రవేశించే అవకాశం కలిగింది.
మల్టీ బ్రాండ్ రిటైల్లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు:
* ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
* పెద్ద రిటైల్ సంస్థలు ఏర్పాటు చేసే కోల్డ్స్టోరేజీలు, గిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాల వల్ల పండ్లు, కూరగాయల్లో వేస్టేజి తగ్గుతుంది.
* టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు దేశానికి అత్యంత అవసరమైన విదేశీ పెట్టుబడులు వస్తాయి.
* దళారుల పాత్ర తొలగి, రైతులకు అధిక ధర గిట్టనుంది.
* రిటైల్ స్థాయిలో ధరలు తగ్గుతాయి కాబట్టి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.
* మార్కెట్లో పోటీ పెరగడం వల్ల అటు ఉత్పత్తిదారులకు, ఇటు వినియోగదారులకు ఉపయోగం.
మల్టీ బ్రాండ్ రిటైల్లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టడం వల్ల కలిగే నష్టాలు:
* ధరలు ప్రారంభంలో తగ్గినా.. రిటైల్ మార్కెట్పై బహుళజాతి కంపెనీలు ఆధిపత్యం పెరిగితే ధరలూ పెరిగిపోతాయి.
* రైతులకు కూడా మొదట్లో మంచి రేటు లభించినా, ఆ తర్వాత వారు మల్టీ బ్రాండ్ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి.
* వేలకొద్దీ చిన్న కిరాణా షాపులు మూతబడతాయి. దాదాపు 4 కోట్ల మంది ఉపాధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కోల్పోతారు.
* పెద్ద కంపెనీలు చౌక రేట్లకు అమ్మడం వల్ల చిన్న, మధ్య తరహా సంస్థలు దెబ్బతింటాయి.
మల్టీ బ్రాండ్ రిటైల్లో వ్యాపారులు తమకు కావలసిన వస్తువులను వివిధ చోట్ల నుంచి కొనుగోలు చేసే శ్రమను తప్పిస్తూ మల్టీబ్రాండ్ రిటైల్ కంపెనీలు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఒకేచోట అన్ని రకాల వస్తువులను చౌకధరలకు అందిస్తాయి. రిజిష్టర్ చేసుకున్న వర్తకులకు మాత్రమే పరిమితమైన ఈ క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో లావాదేవీలు జరుగుతాయి. వినియోగదారుడు జరిపే అన్ని రకాల కొనుగోళ్లకు తక్షణమే చెల్లింపులు జరపుతారు. సాధారణంగా క్రెడిట్ లావాదేవీలు జరిపే కంపెనీలు తమ కస్టమర్ల నుంచి రావాల్సిన బకాయిలను బ్యాలెన్స్షీట్లో ఆస్తులుగా చూపిస్తారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications