దక్కన్ క్రానికల్‌కు రూ.2,000 కోట్లు?

Deccan Chronicle
హైదరాబాద్: అప్పుల ఊబిలో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్‌కు పీపుల్ క్యాపిటల్ అడ్వైజర్స్ అనే పెట్టుబడుల సలహా సంస్థ రూ.2000 కోట్లు సమకూర్చే ఒక ప్రతిపాదనను అందించినట్లుగా సమాచారం. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు దాదాపు రూ.4,000 కోట్లు అప్పు ఉంది. అప్పులు తిరిగి చెల్లించలేని స్థితిలో ప్రత్యామ్నాయాల అన్వేషణలో యాజమాన్యం నిమగ్నమైంది. దీంతో పాటు షేర్లు తనఖా పెట్టి వివిధ ఆర్థిక సంస్థల వద్ద నిధులు సేకరించే క్రమంలో లేని షేర్లను ప్రమోటర్లు తనఖా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనికి సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్, దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రమోటర్లపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పులు ఇచ్చిన ఆర్థిక సంస్థలు ఇదే సమయంలో ట్రైబ్యునళ్లను, న్యాయస్థానాలను ఆశ్రయించ తమ ప్రయోజనాలను పరిరక్షించాల్సిందిగా కోరాయి. దీంతో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు నిధులు సమకూర్చి పెట్టగలమని, తద్వారా సంస్థను గాడిలో పెట్టేందుకు దోహదపడగలమనే ప్రతిపాదనతో పీపుల్ క్యాపిటల్ అడ్వైజర్స్ ముందుకు వచ్చిందని తెలుస్తోంది.

కాగా రుణభారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా రుణ పునర్వవస్థీకరణకు దరఖాస్తు చేయాలని ఇటీవల దక్కన్ క్రానికల్ డైరెక్టర్ బోర్డు నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా సిడిఆర్‌కు ఏ కంపెనీ ఆయినా దరఖాస్తు చేసుకోవచ్చు. సిడిఆర్‌కు ఆమోదం లభిస్తే, వడ్డీ రాయితీ, అసలు చెల్లింపునకు దీర్ఘకాలిక గడువు, మళ్లీ కొంత అప్పు లభించే అవకాశం కంపెనీకి లభిస్తాయి. అందువల్ల ఈ అవకాశం కోసం డిసిహెచ్ఎల్ ప్రయత్నించనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+