
కొత్త యాజమాన్యం చేతికి వచ్చాక కూడా చార్జర్స్ జట్టు హైదరాబాద్ కేంద్రంగా, అదే టీమ్ పేరుతో పని చేస్తుంది. అయితే ఈ విషయంలో కొత్త యాజమాన్యం, బీసీసీఐతో మళ్లీ తాజా ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉంది. జట్టును కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ, చార్జర్స్ అప్పులు తీర్చేందుకు ఆ సొమ్మును నేరుగా బ్యాంకులకే చెల్లించాల్సి ఉంటుంది. ఆటగాళ్ల బాకీలకు కూడా కొత్త ఫ్రాంచైజీ చెల్లించాలి. టీమ్ను కొనుగోలు చేసిన మొత్తంలో ఐదు శాతం బీసీసీఐ ఖాతాలోకి వెళుతుంది. శుక్రవారం నుంచి బుధవారం వరకు టెండర్లు స్వీకరించి గురువారం వాటిని తెరుస్తారు.
నాలుగేళ్ల క్రితం డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీని పది సంవత్సరాలకు గాను డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) యాజమాన్యం సుమారు రూ. 300కోట్లు బిసిసిఐకి చెల్లించి సొంతం చేసుకుంది. ఈ పది సంవత్సరాలకు గాను ఫీజు క్రింద రూ. 428 కోట్లు చెల్లించేందకు సిద్దపడింది. ఇందులో కొంత మొత్తాన్ని ఇప్పటికే చెల్లించింది. ఇంకా 5ఏళ్లు కాలం ఈ ఫ్రాంచైజీని నిర్వహించే అవకాశం డెక్కన్ యాజమాన్యానికి ఉంది. ఈ ఫ్రాంచైజి పేరు మీద ఐసిఐసిఐ బ్యాంకు నుండి రూ. 480 కోట్లు, యస్ బ్యాంకు మరియు మరో ప్రైవేటు బ్యాంకు నుండి ఇంకొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రాంఛైజీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుని ఈ బ్యాంకుల అప్పులు తీర్చడానికి ఉపయోగించనున్నారు.
ఐదు ఐపీఎల్లలో డెక్కన్ చార్జర్స్ టీమ్ ప్రదర్శన, ప్రస్తుత జట్టు బలాబలాలను బట్టి చూస్తే దక్కన్ ఛార్జర్స్ను కొనుగోలు చేయడానికి చెన్నై, అహ్మదాబాద్లకు చెందిన రెండు కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతన్నట్లు తెలుస్తోంది. కాగా ఛార్జర్స్ ప్రారంభ ధరను సుమారు రూ 500-700 కోట్ల మధ్య ఉండే ఖరారు చేసే అవకాశాలు కనబడు తున్నాయి. నష్టాల్లో కూరుకునిపోయిన ఛార్జర్స్ గత ఐపిఎల్కు సంబంధించి బకాయి లను ఇంకా ఆటగాళ్లకు చెల్లించలేదు. అందువల్ల ఆటగాళ్ల బకాయిలను ముందుగా ఛార్జర్స్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేవారు చెల్లించేలా బోర్డు చూస్తున్నట్లు చెబుతున్నారు.
ఒకేసారి ఇంత భారీ మొత్తం చెల్లించడానికి ఎవరు అంత సునాయాసంగా ముందుకు వచ్చే అవకాశం లేనందున, కొంత వెసులుబాటు కూడా కలిగించాలనే అభిప్రాయంతో బోర్డు ఉన్నట్లు ఆ వర్గాలు వివరిం చాయి. ఛార్జర్స్ను కొనుగోలు చేసేవారు సొమ్ములో కొంత సొమ్మును వెంటనే చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే..వారిచ్చే బ్యాంక్ గ్యారంటీ ద్వారా బకాయిలు చెల్లించాలనే ఉద్దేశ్యంతో బోర్డు ఉంది. ఈ క్రమంలో బోర్డు అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఇప్పటికే బ్యాంక్ ప్రతినిధులతో చర్చలు జరిపారని సమాచారం.
2008లో జరిగిన ఐపిఎల్ వేలంపాటలో దాదాపు 107 మిలియన్ డాలర్లను వెచ్చించి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చార్జర్స్ జట్టును సొంతం చేసుకుంది. 2009లో జరిగిన ఐపిఎల్ రెండో ఎడిషన్లో డెక్కన్ ఛార్జర్స్ చాంపియన్గా నిలిచింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications