కస్టమర్స్ కోసం ఆదివారం పనిచేసే ఆలోచనలో ఎస్‌బీఐ బ్యాంకులు

SBI mulls working Sundays to improve efficiency
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదార్లకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామర్దాన్ని మెరుగుపర్చుకునే కృషిలో భాగంగా ఆదివారాల్లోనూ బ్యాంకుల శాఖలను తెరచి ఉంచాలనే యోచన చేస్తోంది. ఒక బ్రోకరేజి సంస్ద ఏర్పాటు చేసిన ఎనలిస్ట్‌ల సదస్సులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ప్రతీప్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.

గతేడాదిలో సాంకేతిక సమస్య కారణంగా ఒకరోజు పనిచేయకపోవడంతో దీనికి బదులుగా అక్టోబర్ 2న (గాంధీ జయంతి, ఆదివారం) బ్యాంక్ శాఖలన్నీ తెరిచి ఎస్‌బీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారాల్లో పనిచేస్తున్న కొన్ని బ్యాంక్ శాఖల్లో కార్యకలాపాల సందర్భంగా ఖాతాదార్ల తాకిడి, సిబ్బంది హాజరు పట్ల ఎస్‌బీఐ యాజమాన్యం సంతృప్తితో ఉంది. దీంతో పూర్తిస్థాయిలో ఆదివారం విధులకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ రంగ ప్రవేశం చేశాక అనేక ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకోని ఎంపిక చేసిన శాఖలను ఆదివారం సైతం తెరిచి ఉంచుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆదివారాల్లో పూర్తిస్థాయి బ్యాంకింగ్ కార్యకలాపాల వల్ల కొత్తతరం కస్టమర్లను విశేషంగా ఆకర్షించవచ్చనేది ఎస్‌బీఐ ఆలోచన. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో బ్యాంకింగ్ లావాదేవీలకు సమస్యలు ఎదుర్కొనేవారిపై దృష్టిసారిస్తోంది. ఆదివారం శాఖలను తెరవడం ద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్‌బీఐకి 14,000 బ్యాంక్ శాఖలు ఉన్నాయి.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+