పాకిస్తాన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు

SBI
సింగపూర్, ఆగస్టు 23: భారత ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బివోఐ)లు త్వరలో పొరుగు దేశం పాకిస్తాన్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. అదే విధంగా పాకిస్తాన్‌కు చెందిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, యునైటెడ్ బ్యాంక్‌లు మనదేశంలో కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. రెండు దేశాల చెందిన సెంట్రల్ బ్యాంకులు లెసైన్సులు ఇవ్వడంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ యాసీన్ అన్వర్ ఒక కార్యక్రమంలో తెలిపారు.

దీని ప్రకారం రెండు భారత్ బ్యాంకులు పాక్‌లోనూ, రెండు పాక్ బ్యాంకులు భార త్‌లోనూ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతులు త్వరలో లభించనున్నాయి. ఇటీవలే పాకిస్తాన్ నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనితో ఇకపై నిర్దేశిత నిబంధనలకు లోబడి ఎఫ్‌డీఐ స్కీములో ఉన్న భారతీయ కంపెనీల షేర్లు, కన్వర్టబుల్ డిబెంచర్లు మొదలైన వాటిలో పాకిస్తాన్ పౌరులు లేదా కంపెనీలు పెట్టుబడులు పెట్టొచ్చని పేర్కొంది. అయితే ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. రక్షణ, అంతరిక్ష పరిశోధన, అణు శక్తి వంటి రంగాల కంపెనీల్లో మాత్రం పాక్ ఎఫ్‌డీఐలను అనుమతించరు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+