మార్కెట్ కబుర్లు: లాభాల్లో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు

భారతీ ఎయిర్ టెల్ షేర్లు 1శాతం తగ్గుముఖం పట్టగా.. ఆ తర్వాత గెయిల్, మారుతి సుజుకీ ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ గా టాటా స్టీల్, టాటా మోటార్స్ ఉన్నాయి. శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నెంబర్స్ను విడుదల చేస్తుండడంతో 1శాతం వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ఎగబాకింది. ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ఉన్నాయి.
సెంట్రల్ బ్యాంకుల నుండి స్టిమ్యులస్ ప్యాకేజీలు వస్తాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నారు. యూరోప్ మార్కెట్లలో ఫ్రాన్స్ సూచీ ఒకటిన్నర శాతం లాభపడింది. దీనితో పాటు జర్మనీ 0.7 శాతం, బ్రిటన్ 0.5 శాతం పెరగగా.. అమెరికా మార్కెట్లలో డౌజోన్స్ 0.4 శాతం, నాస్ డాక్ 0.8 శాతం లాభపడ్డాయి.
జపాన్, దక్షిణ కొరియా సూచీలు ఒకటిన్నర శాతం దాకా లాభపడగా.. సింగపూర్ నిప్టీ 20 పాయింట్లు దాకా పెరుగుతూ 5,360కు సమీపంలో ట్రేడవుతోంది. మార్కెట్లో నగదు ప్రవాహం ఉన్నందున నిప్టీ 5,450 నుండి 5,500ల వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications