సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Government decides SAIL share sale, VSNL land to fetch Rs 10K crore
భారీ లాభాలను ఆర్జిస్తూ, నవరత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో 10.82 శాతం షేర్లను డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా విక్రయించడానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్‌ గురువారం ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.4000 కోట్ల నిధులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనిపై కేంద్రం శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నది.

సెయిల్‌లో ప్రస్తుతం ప్రభుత్వం 85.82 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.30,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో భాగంగానే హెచ్‌ఎఎల్‌, భెల్‌, నాల్కో, హిందుస్థాన్‌ కాపర్‌, ఆయిల్‌ ఇండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. తాజా నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్‌లో సెయిల్‌ షేర్‌ 0.16 శాతం పడిపోయింది.

ఇది మాత్రమే కాకుండా వీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న మిగులు స్థలాన్ని విడగొట్టి(డీమెర్జర్) ప్రత్యేక కంపెనీకి బదలాయించే ప్రతిపాదనను సీసీఈఏ ఎట్టకేలకు ఓకే చేసింది. 2002లో అప్పటి ప్రభుత్వరంగ సంస్థ అయిన వీఎస్‌ఎన్‌ఎల్‌ను టాటా కమ్యూనికేషన్స్ దక్కించుకోవడం విదితమే. ఈ డిజిన్వెస్ట్‌మెంట్‌లో వీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న 773.13 ఎకరాల స్థిరాస్తులను చేర్చకపోవడంతో అప్పటినుంచీ డీమెర్జర్ అంశం పెండింగ్‌లో ఉంది. కాగా, ఈ స్థలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.6,150 కోట్లు లభించగలవని అంచనా వేశారు. దీనితో పాటు విద్యుత్ పరికరాల దిగుమతులపై కేంద్రం 21% దిగుమతి సుంకాన్ని విధించింది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+