ప్రైవేటు పెట్టుబడులతో ఆర్థికవ్యవస్థ బలోపేతం: క్రిసిల్

Economic turnaround hinges on private sector rebound: CRISIL
ముంబై, జులై 18: రూపాయి పతనం, భారతదేశ స్థూ దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గుముఖం పట్టడంతో పతనమవుతున్న మన ఆర్దిక వ్యవస్దను సక్రమైన మార్గంలో పెట్టాలంటే ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ సంస్ద క్రిసిల్ పేర్కొంది. కొన్ని అడ్డంకుల వల్ల ప్రభుత్వ వ్యయాన్ని పెంచే స్దితిలో కేంద్రం లేకపోవడమే దీనికి కారణమని నివేదికలో తెలిపింది. ప్రస్తుతం భారతదేశ స్థూ దేశీయోత్పత్తిలో నాలుగింట మూడొంతుల వాటా ప్రైవేట్ రంగం నుండే వస్తుండడంతో ఆర్దిక వ్యవస్ద పటిష్టంగా ఉండాలంటే ఈ రంగంలో పెట్టుబడులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని నివేదికలో సూచించింది.

1990 నుంచి రెండు దశాబ్దాల వ్యవధికి చూస్తే దేశ జీడీపీ వృద్ధిలో ప్రభుత్వ రంగ వాటా 6% వద్దే నిలిచిపోయింది. ఇదే 90వ దశకంలో ప్రైవేటు రంగ జీడీపీ వృద్ధి 5.7% కాగా, 2000 దశాబ్దిలో 7.7%కు ఎగబాకింది. 2004-05 నుంచి 07-08 మధ్య అయితే ప్రైవేటు రంగ పనితీరు భారీగా మెరుగుపడి 9.7%కు కూడా దూసుకెళ్లింది. కార్పొరేట్ పెట్టుబడులు కూడా జీడీపీలో 10.3% స్థాయి నుంచి 17.3%కు పుంజుకున్నాయని క్రిసిల్ తెలిపింది. దీనితో పాటు ఆర్థిక సంక్షోభం నెలకొన్న 2008-09లో వీటి వాటా జీడీపీలో 11.3 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది.

2008 సంక్షోభ సమయంలో ప్రభుత్వ వ్యయం కారణంగానే వృద్ధిరేటు తీవ్రంగా పడిపోకుండా కాపాడిందని క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ ధర్మకీర్తి జోషి అభిప్రాయపడ్డారు. ఎగబాకుతున్న ద్రవ్యలోటు, ఇతరత్రా ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా వ్యయం పెంపు ద్వారా జీడీపీలో ప్రభుత్వ రంగ వాటాను పెంచే పరిస్థితులు లేవని చెప్పారు. 2009-10లో ప్రభుత్వ రంగ జీడీపీ వృద్ధి 14.5 శాతం నుంచి 2011-12లో 6.5 శాతానికి పడిపోవడాన్ని క్రిసిల్ గుర్తు చేసింది.

ఇది ఇలా ఉంటే దేశ జీడీపీ వృద్ధిరేటు 2008 సంవత్సరం కంటే ముందు ఉన్న దాని కంటే ఒక పర్సేంటేజీ పాయింట్‌ తగ్గి 7.5 శాతానికి పరిమితం కావచ్చునని ఆర్‌బీఐ గవర్నర్‌ సుబ్బరావు అన్నారు. తాజా అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతం కంటే కూడా తగ్గవచ్చునని అన్నారు. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంటో ఆరవ గణాంకశాస్త్ర రోజు సందర్భంగా సుబ్బరావు మాట్లాడుతూ చెప్పారు. ద్రవ్యోల్బణంపై ప్రభావం పడకుండా వృద్ధిరేటు సాధించాలన్నారు.

అంతర్జాతీయ ఏర్పడిన ఆర్థిక మాంద్యానికి ముందు వృద్దిరేటు 8.5 శాతంగా అంచనా వేశామని అయితే ఆర్థిక మాంద్యం సమయంలో 8 శాతంగా నమోదైంది. అధికార గణాంకాల ప్రకారం మే నెలలో జీడీపీ వృద్ధిరేటు 2012 ఆర్థిక సంవత్సరానికి తొమ్మిది నెలల కనిష్ఠానికి 6.5 శాతానికి పడిపోయిందని తెలిపింది. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం సమయంలో 6.7 శాతం కంటే కూడా తగ్గుముఖం పట్టింది. అంత ర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభం ప్రభావం తప్పకుండా భారత్‌పై కూడా ఉంటుందని సూబ్బారావు అన్నారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+