టిసిఎస్‌ను వెనక్కు నెట్టి అత్యంత విలువైన సంస్దగా అవతరించిన ఒఎన్‌జిసి

ONGC surpasses TCS to become most-valued firm
ముంబై, జులై 17: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఒఎన్‌జిసి సోమవారం అత్యధిక మార్కెట్‌ విలువను దక్కించుకుంది. భారతదేశపు ఐటి రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న టాటా గ్రూప్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్‌)ను అధిగమించి ఒఎన్‌జిసి దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ మారింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో విద్యుత్‌ రంగ సంస్థ ఒఎన్‌జిసి సుమారు 2,42,890 కోట్లు మార్కెట్‌ విలువను దక్కించుకుంది. దీంతో దేశంలో ఇతర కంపెనీల కంటే ఒఎన్‌జిసి విలువైన కంపెనీగా పేరును సంపాధించుకుంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టిసిఎస్‌)కు ఉన్న మార్కెట్‌ విలువ రూ 2,41,785 కోట్ల కంటే ఒఎన్‌జిసి రూ 1,105 కోట్లు ఎక్కువ మార్కెట్‌ విలువ కలిగి ఉంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్‌ఈ)పై ఉదయం ఒఎన్‌జిసి స్టాక్‌ ట్రేడ్‌ 0.49 శాతం దిగువన ఉండగా, టిసిఎస్‌ 1.14 శాతం పడిపోయింది. జూలై 3న దేశంలో అత్యంత మార్కెట్‌ విలువ కలిగి ఉన్న టిసిఎస్‌ను వెనకకు నెట్టి ఒఎన్‌జిసి ముందు స్థానంలోకి వచ్చింది.

కానీ ఈ అగ్ర స్థానం కొద్ది రోజులే కొనసాగి మళ్లీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టిసిఎస్‌) తన స్థానాన్ని తిరిగి పొందింది. ప్రస్తుతం రూ. 2,34,785 కోట్ల మార్కెట్‌ విలువతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మూడో స్థానంలో ఉంది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+