స్పెక్ట్రం ఏజెన్సీలకు బిడ్‌ల దాఖలు జులై 20 వరకు గడుపు: ప్రభుత్వం

Government to accept bids for spectrum auctioneer till July 20
న్యూఢిల్లీ, జులై 5: ఇటీవల 2జి - స్పెక్ట్రంలో పలు రకాల అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకోని ప్రభుత్వం ఈ - ఆక్షన్‌ (ఎలక్ట్రానిక్‌ వేలం) ద్వారా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. స్పెక్ట్రంను ఈ వేలం ద్వారా నిర్వహించడం కోసం పోటీపడే ఆక్షన్ ఏజెన్సీలకు బిడ్‌ల దాఖలను ప్రభుత్వం జులై 20వ తారీఖు వరకు గడువును పొడిగించింది. 2జి స్కామ్‌తో 2008 తర్వాత జారీ చేసిన స్పెక్ట్రం లైసెన్స్‌ను రద్దు చేసి మళ్లీ వేలం ద్వారా కేటాయింపులు జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

దీంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికం దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తోంది. మొత్తం 22 టెలికం సర్కిళ్లలో 2జి స్పెక్ట్రంను ఈ-వేలం ద్వారా చేపట్టేందుకు తగిన ఆక్షనీర్ ఎంపిక కోసం టెలికం విభాగం సన్నద్దమవుతోంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం గత షెడ్యూల్ ప్రకారం వేలం నిర్వహణ ఏజెన్సీని జూన్ 20 కల్లా ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆక్షనీర్ల బిడ్‌ల దాఖలు జులై 20 మధ్యాహ్నాం 2.30 వరకు పొడిగించినట్లు పేర్కొంది.

సుప్రీం తీర్పుతో లైసెన్స్‌లు కోల్పోయిన సిస్టెమా శ్యామ్, యూనినార్, వీడియోకాన్ వంటి కొత్త టెల్కోలకు ఈ వేలం కీలకం కానుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఆగస్లు 31వ తేదీలోగా ఈ -వేలం నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, ఈ కంపెనీలు సెప్టెంబర్ 7 వరకూ పాత పర్మిట్లతోనే సేవంలందించేందుకు కోర్టు వెసులుబాటు ఇచ్చింది. 2010లో 3జీ, వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ వేలం సందర్బంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం తొలిసారి ఈ - వేలం పాటకు కొనసాగిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+