'భారత ఆర్థికవ్యవస్థ, ఆర్థిక సర్వే' లో కౌశిక్ బసు అభిప్రాయాలు

Inflation expected to soften from mid-October: Basu
చెన్నై, జులై 4: భారత్‌లో ఇప్పుడున్న అధిక ద్రవ్యోల్బణాన్ని మరో రెండు, మూడు నెలలు భరించక తప్పదని చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వయిజర్‌ కౌషిక్‌ బసు అన్నారు. మరో రెండు లేదా మూడు నెలలు పాటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 7.5 శాతానికి అటూ ఇటుగా కొనసాగుతుందన్నారు. 'భారత ఆర్థికవ్యవస్థ, ఆర్థిక సర్వే' అనే అంశంపై దక్షిణ భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య(సిక్కీ) మంగళవారం నిర్వహించిన చర్చగోష్టిలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ మూడవ వారం నుండి ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టవచ్చునని అన్నారు.

2010లో 20 శాతంగా వున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం పది శాతానికి తగ్గిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం కొనసాగుతున్న తీరు సవ్యంగానే ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువేనని అంగీకరించారు. నిత్యావసర వస్తులు, ద్రవ్యోల్బణం అదుపునకు ప్రభుత్వం దగ్గర మంత్రదండమేదీ లేదన్నారు. అనేక రకాల ద్రవ్య, ఆర్థిక చర్యల రూపంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నారు. అనేక ఇతర వర్ధమాన దేశాలతో పోల్చినపుడు భారత ద్రవ్యోల్బణం నిర్వహణ సరిగానే సాగుతోందన్నారు.

అంతర్జాతీయ రేటింగు సంస్థలు భారత్‌ రేటింగును తగ్గించడంపై మాట్లాడుతూ ఆయా రేటింగు ఏజన్సీల తప్పిదంగా కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. ఇష్టపడినా లేకపోయినా ఆయా సంస్థల ప్రకటనలనూ ముఖ్యమైనవిగానే పరిగణించాలని బసు తెలిపారు. యూరో తదితర కరెన్సీల పతన భయం కారణంగానే రూపాయి విలువ తగ్గిందన్నారు. ప్రస్తుతానికి ఇన్‌ఫ్లేషన్‌ గణాంకాలు వ్యవస్థకు ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఏమీ లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+