IT Jobs: డిజిటల్ యుగంలో ఐటీ వేగంగా అభివృద్ధి చెందటం వల్ల టెక్కీలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రతి ఏటా ఈ రంగంలో డిమాండ్ పెరగుతూనే ఉండటం వాస్తవం. అయితే ప్రస్తుతం ఆర్థిక మందగమనం కారణంగా ఈ స్పీడ్ కాస్త తగ్గింది. అయితే ఒక పరిశ్రమలో మాత్రం డిమాండ్ అస్సలు తగ్గలేదు. పైగా ప్రస్తుతం 20 లక్షల ఉద్యోగుల అవసరం ఉందని తెలుస్తోంది.

ఫ్యూచర్ జాబ్స్..
కాలేజ్ గ్రాడ్యుయేట్లు పక్కాగా ప్లాన్ చేసుకుంటే లక్షల్లో వేతనం అందుకునేందుకు ఈ రంగం సరైనదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇంత డిమాండ్ ఉన్న ఉద్యోగం ఏమిటా అని అనుకుంటున్నారా.. అదే సైబర్ సెక్యూరిటీ. అవును కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు సైబర్ దాడుల ముప్పును ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ నిపుణులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.

సైబర్ సెక్యూరిటీ..
ఇంటర్నెట్ సేవలను కలిగి ఉన్న అన్ని కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరమయ్యే స్థాయికి సైబర్-దాడులు పెరిగిపోయాయి. ఈ రంగంలో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్ల నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. గత ఏడాది మాత్రమే ఈ సెక్టార్ 4,64,000 మంది నిపుణులకు ఉపాధి కల్పించింది. డిజిటలైజేషన్ పెరిగేకొద్దీ వీరికి డిమాండ్ పెరుగుతూనే ఉంది.

ఉద్యోగుల కొరత..
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 21.6 లక్షల మంది సైబర్ నిపుణుల కొరత ఉంది. సరైన సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ లేకపోతే.. కంపెనీ నెట్వర్క్ అధిక రిస్క్ సైట్గా పరిగణించబడుతుంది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ వర్క్ఫోర్స్ ప్రస్తుతం 4.7 మిలియన్లుగా ఉంది.

ఉత్తర అమెరికా..
సైబర్ సెక్యూరిటీ సెక్టార్లో కొత్త ఉద్యోగులను నియమించుకోవడంలో ఉత్తర అమెరికా అతి తక్కువ వృద్ధిని సాధించింది. ఉత్తర అమెరికాలో 6.2 శాతం వృద్ధి ఉన్నప్పటికీ.. 1.34 మిలియన్ల సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఉన్నారు. నిరంతరం ఈ రంగంలో నిపుణుల నియామకాలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఆటోమేషన్, IoT, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ ఉద్యోగులకు అధిక డిమాండ్ ఉంది. విదేశాల్లోని అవకాశాలు మెండుగా ఉండటం భారతీయులకు కలిసొచ్చే అంశం.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications