2 కంపెనీలు.. 5 రోజుల్లో 60వేల కోట్లు.. ఇన్వెస్టర్ల జేబు నింపిన షేర్లు..

గత వారం స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులతో నిండి పోయింది. కానీ సెన్సెక్స్‌లోని టాప్ 10 కంపెనీలలో ఆరు కంపెనీలు భారీ లాభాలను ఆర్జించాయి. కేవలం ఐదు రోజుల ట్రేడింగ్‌లోనే రెండు కంపెనీలలో పెట్టుబడిదారులు రూ.60,000 కోట్లకు పైగా ఆర్జించారు. దీని ఫలితంగా HDFC బ్యాంక్, ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. అంతేకాదు ముఖేష్ అంబానీ రిలయన్స్ కూడా లాభపడింది. కానీ ఆదాయం పరంగా ఈ రెండింటి కంటే చాలా వెనుకబడి ఉంది.

అత్యధికంగా లాభపడిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
గత వారం సెన్సెక్స్‌లోని ఆరు టాప్ 10 కంపెనీల మార్కెట్ వాల్యూ రూ.1,18,151.75 కోట్లు పెరిగింది. అలాగే మిగిలిన నాలుగు కంపెనీలు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ల సెన్సెక్స్ సూచీ 354.23 పాయింట్లు లేదా 0.45 శాతం పెరిగింది. పెట్టుబడిదారులకు బలమైన ఆదాయాలు అందించిన కంపెనీలలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు HDFC ముందంజలో ఉంది. కేవలం ఐదు రోజుల్లోనే HDFC పెట్టుబడిదారులు రూ.32,639.98 కోట్ల లాభాన్ని ఆర్జించారు. ఇది కాకుండా HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా రూ.13,25,090.58 కోట్లకు చేరుకుంది.

2 companie earned Rs 60 thousand crores in 5 days not Reliance Adanis company Infosys TCS are also back

ఎయిర్‌టెల్ అండ్ రిలయన్స్ కూడా లాభపడ్డాయి
పెట్టుబడిదారులకు లాభాలను తెచ్చిపెట్టిన ఇతర కంపెనీల గురించి మాట్లాడుకుంటే భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.31,003.44 కోట్లు పెరిగి రూ.9,56,205.34 కోట్లకు చేరుకుంది. దీనితో పాటు, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.29,032.08 కోట్లు పెరిగి రూ.5,24,312.82 కోట్లకు చేరుకోగా, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.21,114.32 కోట్లు పెరిగి రూ.7,90,074.08 కోట్లకు చేరుకుంది. ఇది కాకుండా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 2,977.12 కోట్లు నుండి రూ. 17,14,348.66 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,384.81 కోట్ల నుండి రూ. 8,87,632.56 కోట్లకు చేరుకుంది.

SBI, TCS నష్టాలు
మరోవైపు, ITC లిమిటెడ్ గత వారం అతిపెద్ద ఎదురుదెబ్బను చవిచూసింది. దింతో ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.39,474.45 కోట్లు తగ్గి రూ.5,39,129.60 కోట్లకు చేరుకుంది. దీనితో పాటు HUL MCAP రూ.33,704.89 కోట్లు తగ్గి రూ.5,55,361.14 కోట్లకు చేరుకుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.25,926.02 కోట్లు తగ్గి రూ.6,57,789.12 కోట్లకు చేరుకోగా, టాటా గ్రూప్ ఐటీ కంపెనీ టీసీఎస్ మార్కెట్ విలువ రూ.16,064.31 కోట్లు తగ్గి రూ.14,57,854.09 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ అత్యంత విలువైన కంపెనీ
ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సెన్సెక్స్‌లోని టాప్-10 కంపెనీలలో అత్యంత విలువైన కంపెనీగా దాని ఆధిపత్యాన్ని కొనసాగించింది. దీని తరువాత, TCS, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, SBI, హిందుస్తాన్ యూనిలీవర్, ITC అండ్ బజాజ్ ఫైనాన్స్ టాప్ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+