జీఎస్టీకి సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ సోమవారం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. జీఎస్టీ స్లాబ్స్ నుండి మినహాయించవలసిన వస్తువులు, ప్రస్తుత స్లాబ్ రేట్లు, జీఎస్టీ ఎగవేతదారుల మూలాలు, ఐటీ సిస్టమ్స్లో మార్పులు తదితర అంశాలపై ఈ కమిటీలు సమీక్షించి నివేదిక ఇవ్వాలి. సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో రెండు మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పుడు ఈ కమిటీలు ఏర్పాటు అయ్యాయి.
జీఎస్టీ పన్ను నుండి మినహాయించాల్సిన వస్తువులు, స్లాబ్స్ విలీనం వంటి అంశాలపై ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ ప్యానెల్కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వం వహిస్తారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్, బీహార్ డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ ఇందులో సభ్యులు. ఈ కమిటీ రెండు నెలల కాలంలో నివేదికను సమర్పిస్తుంది.

జీఎస్టీ పద్ధతిలో తీసుకు వచ్చే సంస్కరణలు, పన్ను ఎగవేత మూలాలు, ఆదాయానికి గండి కొడుతున్న అంశాలపై దృష్టి సారించేందుకు 8 మంది మరో కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్, ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి టీఎస్ సింగ్ డియో సభ్యులుగా ఉంటారు.
ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు రేట్లు ఉన్నాయి. ఇందులో కనిష్టం 5 శాతం, గరిష్ట రేటు 28 శాతంగా ఉంది. 12 శాతం, 18 శాతం కూడా ఉన్నాయి. లగ్జరీ వస్తువులు, డీమెరిట్, సిన్ గూడ్స్ పైన 28 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ జీఎస్టీ రేట్లను నాలుగు నుండి మూడింటికి తగ్గించాలనే డిమాండ్ ఉంది. ఇందులో భాగంగా 12 శాతం, 18 శాతాలను కలిపేయాలనే డిమాండ్ ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications