Toys Seize: 18,600 ఆట బొమ్మలు సీజ్.. ఎందుకంటే..
నకిలీ బొమ్మల విక్రయాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దాడులు చేసింది. BIS గుర్తులు లేకుండా అక్రమంగా దిగుమతి చేసుకున్న 18,600 బొమ్మలను స్వాధీనం చేసుకుంది. దుకాణం యజమానులకు నోటీసులు జారీ చేసింది.
BIS
దేశీయ తయారీదారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు BIS డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. మొదటి దశలో ఎయిర్పోర్టులు, ప్రధాన మాల్స్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో గుర్తు తెలియని, అక్రమంగా దిగుమతి చేసుకున్న 18,600 బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇ-కామర్స్ కంపెనీలు
బిఐఎస్ సర్టిఫికేట్ లేకుండా ఇ-కామర్స్ కంపెనీలు, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా బొమ్మలు అమ్ముతున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయని బీఐఎస్ పేర్కొంది. దీనికి సంబంధించి నిబంధనలను అతిక్రమించవద్దని, బొమ్మల నాణ్యతను కాపాడాలని అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి సంస్థలకు హెచ్చరిక నోటీసు జారీ చేసింది.
సెక్షన్ 29
BIS గుర్తు లేకుండా బొమ్మలు విక్రయిస్తున్న వారిపై BIS చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఐఎస్ అధికారి తెలిపారు. చట్టంలోని సెక్షన్ 29లో పేర్కొన్న శిక్షా నిబంధనల ప్రకారం వారికి శిక్ష పడుతుందని చెప్పారు. అధికారులే కాదు ఖాతాదారులు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. బొమ్మలపై BIS గుర్తు తనిఖీ చేయాలని కోరారు. BIS మార్కులు లేని ఉత్పత్తిని ఆన్లైన్తో సహా ఏదైనా మాల్లో ఉంటే తమ దృష్టికితీసుకురావాలని సూచించారు.
ఫిర్యాదు
ఉత్పత్తిపై ఫిర్యాదు చేస్తే విక్రేతపై తగిన చర్యలు తీసుకుంటామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
రాంచీ, నోయిడా, ఢిల్లీ విమానాశ్రయం, కోల్కతాలోని హామ్లీస్ స్టోర్లలో అక్రమ బొమ్మలను స్వాధీనం చేసుకున్నారు. రానున్న రోజుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విదేశాల నుంచి తీసుకొచ్చే సరకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు.