Lottery: లాటరీలో జాక్ పాట్ మెుత్తంలో డబ్బులు సంపాదించారనే వార్తలు మనం సహజంగానే వింటుంటాం. అయితే ఇది ఒక్కరికో లేక ఇద్దరికో తగిలే అదృష్టమని భావిస్తుంటాం. అసలు రికార్డు స్థాయిలో ఒకే ఊరి నుంచి వందమందికి పైగా లాటరీ విజేతలుగా నిలిచి ధనవంతులయ్యారనేది వింటేనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మారిన తలరాత..
ఒక నివేదిక ప్రకారం.. ఒక గ్రామంలో నివసించే 165 మందికి అదృష్టం కలిసొచ్చింది. ఏకకాలంలో వారు రాత్రికి రాత్రే ధనవంతులయ్యారు. లాటరీలో ఏకంగా 165 మంది తలరాత మారిపోయింది. సమాచారం ప్రకారం వీరు గెలిచిన మెుత్తం లాటరీ సొమ్ము విలువ దాదాపు రూ.1,200 కోట్లు. అసలు ఈ సంఖ్య వింటేనే కళ్లు తిరిగిపోతున్నాయి.

ఒక్కొక్కరికి రూ.7.5 కోట్లు..
ఎక్కడైనా లాటరీ తగిలితే లక్షాధికారులు అవుతుంటారు. కానీ ఈ గ్రామంలో గెలుపొందిన ప్రతి వ్యక్తికి రూ.7.5 కోట్లకు పైగా డబ్బు గెలుపొందారు. యూరప్లోని బెల్జియంలోని ఆంట్వెర్ప్ ప్రావిన్స్లో ఉన్న ఓల్మెన్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అక్కడి ప్రజలందరూ లాటరీ గెలుపొందటంతో సంతోషంలో ఉన్నారు.

లాటరీలో అదృష్టం..
డైలీ మెయిల్ వార్తా సంస్థ ప్రకారం.. యూరోమిలియన్స్ లాటరీలో ఓల్మెన్ గ్రామానికి చెందిన 165 మంది ఈ బహుమతిని గెలుచుకున్నారు. ఈ వ్యక్తులు కలిసి లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేశారు. టిక్కెట్ కలిసి కొనుగోలు చేసేందుకు గ్రామంలోని ఒక్కొక్కరు రూ.1,308 చెల్లించారు. గత మంగళవారం ఫలితాలు వచ్చి లక్కీ డ్రా వివరాలు వెలువడ్డాయి. ఇందులో గ్రామస్తులు మెుత్తంగా 123 మిలియన్ పౌండ్లను ప్రైజ్ మనీగా గెలుపొందారు. ఇది భారతీయ కరెన్సీలో రూ.1,200 కోట్లకు సమానం.

సమానంగా పంపిణీ..
గెలుచుకున్న 123 మిలియన్ యూరోల ప్రైజ్ మనీని 165 మందికి పంచుతారు. అలా భారత కరెన్సీలో ఒక్కొక్కరికి సుమారు ఏడున్నర కోట్లు అందుతాయి. విశేషమేమిటంటే ఈ ప్రైజ్ మనీని అందరికీ సమానంగా పంచాలని సదరు గ్రామస్తులు ముందే నిర్ణయించుకున్నారు. లాటరీని కొనుగోలు చేయడానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్న వారు ఇప్పుడు దానినే ఆచరిస్తున్నారు. పండుగకు కొద్ది రోజుల ముందు తమకు ఈ అదృష్టం దక్కటంపై గ్రామంలోని కొందరు దీనిని 'ఉత్తమ క్రిస్మస్ కానుక'గా భావిస్తారు.

అతిపెద్ద బహుమతి..
ఇలాంటి భారీ మెుత్తాలను ప్రజలు గెలుచుకోవటం ఇదే తొలిసారికాదని జాతీయ లాటరీ ప్రతినిధి జాక్ వెర్మోర్ తెలిపారు. దీనికి ముందు బ్రిటన్కు చెందిన ఒక వ్యక్తి ఈ ఏడాది జూలైలో ఏకంగాన 195 మిలియన్ పౌండ్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ.19,000 కోట్లుగా ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications