16 గంటల పని.. ఓవర్‌టైం జీతం అడిగితే ఉద్యోగం నుంచి పీకేసారు..హైదరాబాద్ ఐటీ రంగంలో కలకలం

టెక్ రంగంలో ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పని గంటలు ఎక్కవ కావడంతో ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. చాలా మంది ఉద్యోగులు ఈ ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు అయితే కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. చాలామంది కంపెనీని ఓ పని ఒత్తిడి గురించి ప్రశ్నిస్తున్నారు.

అయితే వారి ప్రశ్నించగానే కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్నాయి.తాజాగా హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి ఇలాంటి అనుభమే ఎదురయింది. ఇప్పుడు హైదరాబాద్‌లో పనిచేసిన ఒక మాజీ ఎంఎన్‌సీ ఉద్యోగి వ్యవహారం ఈ సమస్యను మరింత స్పష్టంగా బయటపెట్టింది.

అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంస్థలో సుమారు 14 ఏళ్ల పాటు పనిచేసిన ఓ ఐటీ నిపుణుడు.. రోజుకు సగటున 16 Hours పైగా పనిచేయాల్సి వస్తోందని అధికారికంగా ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ఉద్యోగం నుంచి కంపెనీ తొలగించింది. కంపెనీ తనను అన్యాయంగా తొలగించిందని ఆరోపిస్తూ ఆ ఉద్యోగి.. కార్మిక చట్టాల ఉల్లంఘనపై చట్టపరమైన పోరాటానికి దిగాడు.

Hyderabad techie fired 16 hours a day work long working hours IT Hyderabad IT employee sacked MNC fires employee toxic work culture IT IT work pressure India Hyderabad tech news employee fired for complaint IT workplace controversy long work hours complaint MNC work culture India Hyderabad software engineer fired employee rights IT sector overwork in IT industry 16 MNC

ఆ మాజీ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం.. వనరుల కొరత పేరుతో నెలల తరబడి అధిక పని భారం మోపారని, అదనపు గంటలకు చెల్లించాల్సిన ఓవర్‌టైం వేతనం ఇవ్వలేదని అన్నారు. శారీరకంగా, మానసికంగా రోజుకు ఇన్ని గంటలు పని చేయడం అసాధ్యం. కంపెనీలు క్లయింట్ల నుంచి గంటల ప్రాతిపదికన బిల్లులు వసూలు చేస్తున్నప్పుడు.. ఉద్యోగులకు ఎందుకు అదే విధంగా జీతం ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు.

ఈ సమస్యపై సంస్థ అంతర్గతంగా స్పందన లభించకపోవడంతో.. మొదట జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన ఆ ఉద్యోగి, అనంతరం తెలంగాణ కార్మిక శాఖకు అధికారిక ఫిర్యాదు చేశారు. అయితే తన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా.. సమస్యను లేవనెత్తిన వారంలోపే ఉద్యోగం నుంచి తొలగించడం తనను మరింత కలిచివేసిందని ఆయన ఆవేదన చెందారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని ఆరోపించారు.

తాను అనారోగ్యంతో ఉన్న రోజుల్లో కూడా పని చేయమని ఒత్తిడి తెచ్చారని, రాత్రి షిఫ్ట్‌లు, తెల్లవారుజామున షిఫ్ట్‌లకు రావాల్సిన అలవెన్సులు ఇవ్వలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఓవర్‌టైం బకాయిలు, వడ్డీ, జరిమానాల కోసం కంపెనీపై చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ సంఘటన పని-జీవిత సమతుల్యతపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల మధ్య మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో వారానికి 72 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలతో పని గంటలపై పెద్ద ఎత్తున వాదనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యువత ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, కుటుంబంతో గడిపే సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న మరో ఐటీ ఉద్యోగి మాట్లాడుతూ..మహమ్మారి తర్వాత జీతం లేకుండా వారాంతాల్లో, సెలవు రోజుల్లో పని చేయడం సాధారణమైపోయింది. మేనేజ్‌మెంట్ నుంచి టీమ్ లీడర్ల వరకు అందరికీ ఇది తెలుసు కానీ ఎవరూ ఎదురు మాట్లాడటం లేదని అన్నారు. బడ్జెట్ పరిమితులు, వనరుల కొరత పేరుతో ఉద్యోగులను అదనపు పనికి బలవంతం చేయడం, నిరాకరిస్తే ఉద్యోగం తీసేస్తామని బెదిరించడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+