న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఓ తీపికబురు ఇచ్చింది. అదనంగా 2,655 కోట్ల రపాయల మేర రుణాలను తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి- నిర్మల సీతారామన్ సారథ్యంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లక్ష్యాన్ని అందుకోవడం వల్ల అదనపు రుణాన్ని తీసుకునే వెసలుబాటును కల్పించింది.

ఏపీ సహా 11 రాష్ట్రాలు..
ఏపీ సహా మొత్తం 11 రాష్ట్రాలు ఈ లక్ష్యాన్ని అందుకున్నాయి. ఆయా రాష్ట్రాలన్నింటికి కూడా డిమాండ్, అవసరాలకు అనుగుణంగా రుణాలను తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రాల అవసరాల మేర రుణ మొత్తాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. 11 రాష్ట్రాలు కలిపి 15,271 కోట్ల రూపాయల మేర రుణాలను పొందవచ్చని తెలిపింది. ఇందులో ఏపీ వాటా 2,655 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో (జీఎస్డీపీ)లో 0.25 శాతానికి సమానం ఈ మొత్తం.

ఆ రాష్ట్రాలివే..
ఏపీతో పాటు బిహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్-మే-జూన్ నెలల కాలానికి కేంద్రం నిర్దేశించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టార్గెట్ను అందుకున్నాయి. ఈ జాబితాలో దక్షిణాది నుంచి ఏపీ ఒక్కటే ఈ లక్ష్యాన్ని అందుకోవడం ఇక్కడి ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

జీఎస్డీపీలో
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లక్ష్యాన్ని అందుకోవడం అంటే ఆర్థిక ప్రగతి రేటు అంచనాలకు అనుగుణంగా ఉన్నట్టే. ఆర్థిక ప్రగతిరేటును నిర్ధారించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికానికి అన్ని రాష్ట్రాలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంటుంది. ఇది ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ చోటు చేసుకునే ప్రక్రియే. ఈ లక్ష్యాన్ని అందుకున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటుంది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 0.25 శాతానికి సమానంగా అదనంగా రుణాలను తీసుకోవడానికి అనుమతి ఇస్తుంటుంది.

ఏ రాష్ట్రానికి ఎంత..
ఈ దఫా 15,721 కోట్ల రూపాయల మేర అదనపు రుణాలను తీసుకోవడానికి ఆ 11 రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది. ఇందులో 2,655 కోట్ల రూపాయల మొత్తాన్నీ ఏపీ వాటాగా నిర్ధారించింది. బిహార్-1,699, ఛత్తీస్గఢ్-895, హర్యానా-2,105, కేరళ-2,255, మధ్యప్రదేశ్-2,590, మణిపూర్-90, మేఘాలయా-96, నాగాలాండ్-89, రాజస్థాన్-2,593, ఉత్తరాఖండ్-654 కోట్ల రూపాయల మేర రుణం తీసుకోవచ్చు. రెండో త్రైమాసికానికి సంబంధించిన వివరాలు వచ్చే నెల వెల్లడయ్యే అవకాశం ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications