రిలయన్స్, టీసీఎస్ దిగదుడుపే: ఐపీవోకు వెళ్తే దేశంలో అతిపెద్ద కంపెనీగా ఎల్ఐసి!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)... భారత దేశంలో ఈ పేరు తెలియని వారుండరు. కోట్ల మంది జీవితాలకు బీమా రక్షణ కల్పిస్తూ, ఆపత్కాలంలో ఆదుకునే నేస్తంగా దీనికి గుర్తింపు ఉంది. 60 ఏళ్ళ నుంచి దేశ ప్రజల సేవకు అంకితమైన ఈ ప్రభుత్వ రంగ సంస్థ... త్వరలోనే స్టాక్ మార్కెట్ల లో లిస్ట్ అవబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన సందర్భంగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి మరోసారి ఎల్ఐసి పై పడింది. ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యం లో నడుస్తున్న సంస్థ అనే విషయం తెలిసిందే.

ఈ సంస్థ విలువ మదింపు చేయటం ఒకరకంగా క్లిష్టమైన పని. ఎందుకంటే, రూ లక్షల కోట్లలో స్థిర, చర ఆస్తులను కలిగి ఉంది. అందుకే, ఒక వేళ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా ఎల్ఐసి గనుక స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయితే... విలువ పరంగా అదే దేశంలో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించనుంది. మార్కెట్ క్యాపిటలైజెషన్ ప్రకారం ముకేశ్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ కూడా ఎల్ఐసి ముందు చిన్నబోనున్నాయి. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది.

దేశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవో ...

దేశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవో ...

ఎల్ఐసిలో ప్రస్తుతం 100% వాటా ప్రభుత్వం వద్దే ఉంది. ఇందులో ఒక 25-30% ఆస్తుల మదింపు జరిపినా దాని విలువ సుమారు రూ 10 లక్షల కోట్లు అవుతుంది. అందులో ఒక 10% వాటా విక్రయించినా కూడా దానిని కొనుగోలు చేసేందుకు మన ఇన్వెస్టర్లు సరిపోరు. ఎందుకంటే ఇది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద ఐపీవో కానుంది. ఇటీవల సౌదీ ఆరాంకో కంపెనీ ఎలాగైతే ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో గా చరిత్ర సృష్టించిందో, ఎల్ఐసి కూడా అందుకు ఏమాత్రం తీసిపోదని స్టాక్ మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు. 60 ఏళ్ల ప్రస్థానం కలిగిన ఎల్ఐసి కి కేవలం 20 ఏళ్ళ అనుభవం ఉన్న ప్రైవేటు రంగ సంస్థలతో పోటీ ఉండదని, విలువ మదింపు జరిపేటప్పుడు అది గీటురాయి కాబోదని చెబుతున్నారు.

బడ్జెట్ లో హైలైట్...

బడ్జెట్ లో హైలైట్...

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎల్ఐసి పేరు ప్రస్తావించటంతో ఎప్పటి నుంచో దానిని ప్రైవేటీకరిస్తారన్న విషయంపై మబ్బులు తొలగిపోయాయి. అయితే, ఎల్ఐసి ని ప్రైవేటీకరించే కంటే ఐపీవో మార్గంలో కొంత వాటా విక్రయించటమే బెటర్ అని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. అందుకే బడ్జెట్లో ఈ ప్రస్తావన చేశారు. బడ్జెట్లో ఇదే అంశం హైలైట్ గా నిలిచిందని స్టాక్ మార్కెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు. తక్కువలో తక్కువగా ఎల్ఐసి విలువను రూ 10 లక్షల కోట్లు అని లెక్కించినా... అందులో ప్రభుత్వం ఒక 5% వాటా విక్రయించినా కూడా దానికి రూ 50,000 కోట్ల నిధులు సమకూరుతాయి. దీంతో 202-21 కి విధించుకున్న డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ ను ఈజీగా ప్రభుత్వం చేరుకుంటుందని భావిస్తున్నారు.

రిటైల్ ఇన్వెస్టర్లు వరం...

రిటైల్ ఇన్వెస్టర్లు వరం...

60 ఏళ్ళ తన ప్రస్థానంలో ఎల్ఐసి అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఒకవైపు తన వినియోగదారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే.. మరో వైపు ప్రతియేటా తన లాభాలను పెంచుకుంటోంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డివిడెండ్ చెల్లిస్తోంది. లాభదాయకత అధికంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్ఐసి ముందు వరుసలో ఉంటుంది. అందుకే, ఈ సంస్థ విజయ ప్రస్థానంలో పాలు పంచుకునేందు ఐపీవో ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక అవకాశం లభిస్తుంది. సంపద సృష్టి, అందులో భాగస్వామ్యం సాధ్యమవుతుంది. అలాగే, ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్ల లో లిస్ట్ అయితే.. ఎల్ఐసి తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుంది. కేవలం ప్రభుత్వం చెప్పింది కదా అని ఎవరికి పడితే వారికి పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయటం కుదరదు. ఇకపై అంతా పారదర్శకంగా, నిబంధనలకనుగుణంగా చేల్సి ఉంటుంది. అంటే క్రమశిక్షణ అలవడుతుంది. అది అటు ఎల్ఐసి కి, ఇటు తన కస్టమర్లకు మరింత మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+