తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఎంఈలకు రూ.985 కోట్ల రుణం
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఎంఎస్ఎంఈ రంగానికి ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారెంటీ స్కీం కింద ఈ నెల 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 2.88 లక్షల ఖాతాలకు రూ.17,705 కోట్ల రుణం మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల వాటా రూ.985 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 11,895 కోట్ల ఖాతాలకు రూ.1,105 కోట్లు మంజూరు చేసింది. ఇ్పపటి వరకు 6,389 ఖాతాలకు రూ.571.15 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 9,734 ఖాతాలకు రూ.824.58 కోట్లు మంజూరు చేసారు. ఇప్పటి వరకు 5,451 ఖాతాలకు రూ.414.36 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 1.51 లక్షల ఖాతాలకు రూ.8,320 కోట్ల రుణం ఇప్పటికే పంపిణీ చేశామన్నారు.
కరోనావైరస్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.21 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు అదనంగా 10 నుండి 15 శాతం వర్కింగ్ మూలధన పెట్టుబడిని అందించేందుకు క్రెడిట్ గ్యారంటీ పథకం తీసుకు వచ్చింది.