సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరట ప్రకటన చేశారు. బ్యాంకులు కారణం లేకుండానే రుణాల్ని మంజూరు చేయకుంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదలన గురించి ట్రేడర్స్కు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈలకు పై సూచన చేశారు.

కారణం లేకుండా రుణాలు మంజూరు చేస్తే ఫిర్యాదు
ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు ఎలాంటి కారణం లేకుండా రుణం మంజూరు చేయకుంటే తమకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఫిర్యాదు చేసినప్పుడు సంబంధిత బ్యాంకు మేనేజర్కు కూడా ఓ కాపీని పంపించాలని చెప్పారు. రుణాలు నిరాకరించిన ఉద్యోగిపై సంబంధిత బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు ఉండాలన్నారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెంటర్
ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రజలు బ్యాంకులను సంప్రదించినప్పుడు హేతుబద్ద కారణం లేకుండా బ్యాంకులు నిరాకరించలేవన్నారు. అలా నిరాకరిస్తే ఫిర్యాదు చేసేందుకు త్వరలో ఆర్థిక శాఖ ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలో ఎంఎస్ఎంఈల పునాదులు బలంగా ఉన్నాయని చెప్పారు. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన వల్ల ప్రభుత్వానికి ఆస్తులు సృష్టించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.

అందుకే విదేశీ మారకనిల్వలు ఎక్కువగా ఉన్నాయి
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలు అభివృద్ధి చెందే విధంగా ఉందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మూలాలు బాగున్నందునే విదేశీ మారకం నిల్వలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్నారు. గతంలో బ్యాంకులు తమ సంబంధీకులకు ఫోన్ బ్యాంకింగ్ ద్వారా రుణాలు మంజూరు చేశాయని, దీంతో నిరర్ధక ఆస్తులు ఎక్కువస్థాయిలో పెరిగాయని తెలిపారు.

నాలుగేళ్లు పట్టింది
నిరర్థక ఆస్తులను పరిష్కరించేందుకు నాలుగేళ్లు పట్టిందన్నారు. గతంలో జరిగిన ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు మంచి పాఠాలు నేర్చుకున్నామని, అనవసరమైన ఖర్చులను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని చెప్పారు. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల ద్వారా ఆస్తులు సృష్టించేందుకు నిర్ణయించిందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications