కరోనా మహమ్మారి కారణంగా ఎంఎస్ఎంఈలు చితికిపోయాయి. వీటికి అండగా ఉండేందుకు కేంద్రం దాదాపు రూ.4 లక్షల కోట్ల ఉద్దీపనలు ప్రకటించింది. ప్రభుత్వమే హామీ ఇచ్చే ఈ రుణం ద్వారా చిన్న కంపెనీలు తిరిగి కోలుకోవడానికి ఉపయోగపడతాయి. మాస్టర్ కార్డ్ కూడా ఇండియాలో చిన్న సంస్థలకు (ఎస్ఎంబీ) అండగా ఉండనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారీ మొత్తాన్ని కేటాయించినట్లు తెలిపింది.

రూ.250 కోట్ల సాయం
కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో చిన్న, మధ్యతరహా కంపెనీలకు సాయం చేసేందుకు రూ.250 కోట్లు (33 మిలియన్ డాలర్లు) కేటాయించినట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. 2025 నాటికి దేశంలో 100 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడతామని గతంలో ఈ టెక్ దిగ్గజం ప్రకటించింది. దీనికి అదనంగా ఇప్పుడు ఈ సాయం ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ సహకారం
నగదు, సరఫరా గొలుసుపై ఎక్కువగా ఆధారపడిన చిన్న కంపెనీలు కరోనా కారణంగా భారీగా ప్రభావితమయ్యాయి. ఈ సవాళ్లను సాధ్యమైనంత మేర పరిష్కరించేందుకు నగదును అందుబాటులోకి తెచ్చేందుకు తద్వారా డిమాండ్ పెంచేందుకు, వ్యాపార పునరుద్ధరణకు ఇది ఉపయోగపడుతుందని మాస్టర్ కార్డ్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్టర్ కార్డ్ 250 మిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా కేటాయిస్తున్నట్లు ఏప్రిల్ నెలలో ప్రకటించింది. ఇందులో భారత్కు 33 మిలియన్లు కేటాయించింది.

వీటి కోసం
చిన్న కంపెనీల డిజిటలీకరణకు, ఆయా సంస్థలు రుణాలు సులభంగా పొందేందుకు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీటిని వినియోగిస్తామని మాస్టర్ కార్డ్ సౌత్ ఏషియా చీఫ్ పోరష్ సింగ్ తెలిపారు. చిన్న వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థకు పునాది అని, జీడీపీలో వీటి వాటా 35 శాతం వరకు ఉందన్నారు. కోటి మంది వ్యాపారులు డిజిటల్ సిస్టం ద్వారా నగదును స్వీకరించేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. షాపులు, బ్రాండ్స్తో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. దీంతో పారదర్శక అమ్మకాలు పెరిగి ఆర్థిక సంస్థలకు వ్యాపారాలపై స్పష్టత వస్తుందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications