కరోనా మహమ్మారి కారణంగా ఎంఎస్ఎంఈలు చితికిపోయాయి. వీటికి అండగా ఉండేందుకు కేంద్రం దాదాపు రూ.4 లక్షల కోట్ల ఉద్దీపనలు ప్రకటించింది. ప్రభుత్వమే హామీ ఇచ్చే ఈ రుణం ద్వారా చిన్న కంపెనీలు తిరిగి కోలుకోవడానికి ఉపయోగపడతాయి. మాస్టర్ కార్డ్ కూడా ఇండియాలో చిన్న సంస్థలకు (ఎస్ఎంబీ) అండగా ఉండనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారీ మొత్తాన్ని కేటాయించినట్లు తెలిపింది.

రూ.250 కోట్ల సాయం
కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో చిన్న, మధ్యతరహా కంపెనీలకు సాయం చేసేందుకు రూ.250 కోట్లు (33 మిలియన్ డాలర్లు) కేటాయించినట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. 2025 నాటికి దేశంలో 100 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడతామని గతంలో ఈ టెక్ దిగ్గజం ప్రకటించింది. దీనికి అదనంగా ఇప్పుడు ఈ సాయం ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ సహకారం
నగదు, సరఫరా గొలుసుపై ఎక్కువగా ఆధారపడిన చిన్న కంపెనీలు కరోనా కారణంగా భారీగా ప్రభావితమయ్యాయి. ఈ సవాళ్లను సాధ్యమైనంత మేర పరిష్కరించేందుకు నగదును అందుబాటులోకి తెచ్చేందుకు తద్వారా డిమాండ్ పెంచేందుకు, వ్యాపార పునరుద్ధరణకు ఇది ఉపయోగపడుతుందని మాస్టర్ కార్డ్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్టర్ కార్డ్ 250 మిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా కేటాయిస్తున్నట్లు ఏప్రిల్ నెలలో ప్రకటించింది. ఇందులో భారత్కు 33 మిలియన్లు కేటాయించింది.

వీటి కోసం
చిన్న కంపెనీల డిజిటలీకరణకు, ఆయా సంస్థలు రుణాలు సులభంగా పొందేందుకు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీటిని వినియోగిస్తామని మాస్టర్ కార్డ్ సౌత్ ఏషియా చీఫ్ పోరష్ సింగ్ తెలిపారు. చిన్న వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థకు పునాది అని, జీడీపీలో వీటి వాటా 35 శాతం వరకు ఉందన్నారు. కోటి మంది వ్యాపారులు డిజిటల్ సిస్టం ద్వారా నగదును స్వీకరించేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. షాపులు, బ్రాండ్స్తో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. దీంతో పారదర్శక అమ్మకాలు పెరిగి ఆర్థిక సంస్థలకు వ్యాపారాలపై స్పష్టత వస్తుందన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications