వాల్ స్ట్రీట్ మంగళవారం పెట్టుబడిదారులు ఊహించని స్థాయిలో కుదుపులకు లోనయింది. నిన్న ఒక్క రోజు పతనం గత మూడు నెలల్లో అతిపెద్ద పతనంగా అమెరికా స్టాక్ మార్కెట్లో నమోదైంది. డౌ జోన్స్, ఎస్అండ్పీ 500, నాస్డాక్ అనే మూడు ప్రధాన సూచీలు ఒకేసారి తీవ్రంగా పడిపోవడంతో అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దీంతో పెట్టుబడిదారుల్లో తీవ్ర భయాందోళనలు వ్యాపించాయి. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకంజ వేయడం స్పష్టంగా కనిపించింది.
ఈ పతనానికి ప్రధాన కారణంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలే కారణం. గ్రీన్ల్యాండ్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని యూరోప్పై కొత్త సుంకాలు విధిస్తానంటూ చేసిన హెచ్చరికలు మార్కెట్ను ఒక్కసారిగా కుదిపేశాయి. యూరోపియన్ ఉత్పత్తులపై ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు అమలు చేస్తామని.. జూన్ 1 నాటికి వాటిని 25 శాతం వరకు పెంచే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు.

గ్రీన్ల్యాండ్ను అమెరికా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న తన వాదనను ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. అయితే డెన్మార్క్, గ్రీన్ల్యాండ్ నేతలు ఈ ద్వీపం అమ్మకానికి లేదని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలే మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో 'రిస్క్-ఆఫ్' భావన బలపడింది. అంటే పెట్టుబడిదారులు ప్రమాదకర పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి భద్రమైన ఆస్తుల వైపు మొగ్గు చూపారు.
ఫలితంగా బంగారం ధరలు మరోసారి సరికొత్త గరిష్టాలను తాకాయి. అదే సమయంలో అమెరికా ట్రెజరీ బాండ్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. క్రిప్టో మార్కెట్ కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయింది. బిట్కాయిన్ ధర ఒక్కరోజులోనే మూడు శాతం కంటే ఎక్కువగా పడిపోయింది.
స్టాక్ సూచీల విషయానికి వస్తే..ఎస్అండ్పీ 500 సూచీ రెండు శాతం కంటే ఎక్కువగా తగ్గి గణనీయమైన నష్టంతో ముగిసింది. నాస్డాక్ కంపోజిట్ టెక్ షేర్ల అమ్మకాల కారణంగా మరింత తీవ్రంగా మార్కెట్ పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ కూడా సుమారు 850 పాయింట్లకు పైగా పతనమై, మూడు నెలల్లో అతిపెద్ద రోజువారీ నష్టాన్ని నమోదు చేసింది. ఈ కదలికలు మార్కెట్లో భయాన్ని కొలిచే సూచికగా భావించే VIX ఇండెక్స్ను కూడా ఒక్కసారిగా పైకి నెట్టాయి. ఇది పెట్టుబడిదారుల ఆందోళన స్థాయి పెరిగిందని స్పష్టం చేసింది.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే కారణంగా సోమవారం అమెరికా మార్కెట్లు మూసివుండటంతో.. ట్రంప్ వ్యాఖ్యలపై పెట్టుబడిదారులు మంగళవారమే మొదటిసారి స్పందించాల్సి వచ్చింది. యూరోప్తో పాటు స్కాండినేవియన్ దేశాలు కూడా ఈ సుంకాల బెదిరింపుల పరిధిలోకి వచ్చే అవకాశం ఉండటంతో.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడుతుందన్న భయాలు పెరిగాయి. ఇది కేవలం తాత్కాలిక పతనమా, లేక దీర్ఘకాలిక అస్థిరతకు సంకేతమా అన్న దానిపై మార్కెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్టాక్ మార్కెట్లతో పాటు బాండ్ మార్కెట్లు కూడా ఈ ఒత్తిడిని అనుభవించాయి. జపాన్ వంటి దేశాల్లో బాండ్ యీల్డ్లు పెరగడం, స్టాక్ ధరలు పడిపోవడం వంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అస్థిరతను సూచించాయి. అమెరికా ట్రెజరీ బాండ్లపై అమ్మకాలు పెరగడంతో బాండ్ ధరలు తగ్గాయి, యీల్డ్లు పైకి కదిలాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications