ఈ కంపెనీ షేరు ఒక్క కారణంతో దుమ్ము రేపింది.. భారీగా లాభాలును పోగేసుకున్న ఇన్వెస్టర్లు..కారణమిదే..
దేశీయ ప్రముఖ రీటైల్ రంగానికి చెందిన Vishal Mega Mart మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పనిచేస్తున్న గుణేందర్ కపూర్ను మరో ఐదేళ్ల కాలానికి తిరిగి నియమించడానికి విశాల్ మెగా మార్ట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కంపెనీ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా సమాచారాన్ని అందించింది.
ఆగష్టు 21న జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా బోర్డు ఈ పునఃనియామకానికి పచ్చజెండా ఊపింది. కపూర్ కొత్త పదవీకాలం 2026 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చి.. 2031 ఆగష్టు 31 వరకు కొనసాగుతుందని ఫైలింగ్లో పేర్కొన్నారు. ఈ నియామకం కంపెనీ వాటాదారుల (Shareholders) తుది ఆమోదానికి లోబడి ఉంటుంది. కపూర్ను కంపెనీ వ్యవస్థాపకుడిగా, ఎండీ, సీఈఓగా కూడా కొనసాగించనున్నారు.

వాస్తవానికి గుణేందర్ కపూర్ను మొదట జూన్ 2024లో మూడేళ్ల పదవీకాలానికి ఈ బాధ్యతల్లో నియమించారు. ఆయన ప్రస్తుత కాలపరిమితి 2027 జూన్ 26తో ముగియాల్సి ఉంది. అయితే ప్రస్తుత పదవీకాలం ముగియడానికి మరో తొమ్మిది నెలల సమయం ఉందనగానే బోర్డు ఆయన పునఃనియామకాన్ని వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. కంపెనీ వృద్ధిలో ఆయన చూపిన చొరవ, వ్యూహాత్మక నాయకత్వానికి ఈ నిర్ణయం అద్దం పడుతోంది. అలాగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) గానీ లేదా మరే ఇతర అధికారిక సంస్థ గానీ కపూర్ను డైరెక్టర్ పదవి చేపట్టకుండా నిరోధించలేదని కంపెనీ స్పష్టం చేసింది.
గుణేందర్ కపూర్కు వినియోగదారు (Consumer), రీటైల్ రంగాలలో ఏకంగా 42 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైన నిర్వహణ, పెట్టుబడి అనుభవం ఉంది. ఆయన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) నుండి ఇంజనీరింగ్లో ఆనర్స్ డిగ్రీని, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ (MBA) పూర్తి చేశారు. విశాల్ మెగా మార్ట్లో చేరడానికి ముందు ఆయన హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ (HLL), యూనిలివర్ నైజీరియా పీఎల్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు టీపీజీ (TPG) క్యాపిటల్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థల్లో కీలక పదవులను నిర్వర్తించారు. కంపెనీలోని ఇతర డైరెక్టర్లతో ఆయనకు ఎలాంటి వ్యక్తిగత లేదా కుటుంబ సంబంధాలు లేవు.
2001లో ప్రారంభమైన విశాల్ మెగా మార్ట్, భారతదేశంలోని మధ్య-ఆదాయ, దిగువ-మధ్య-ఆదాయ కుటుంబాల అవసరాలను తీర్చే ప్రముఖ హైపర్మార్కెట్ నెట్వర్క్గా నిలిచింది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాలపై దృష్టి సారిస్తూ ఫ్యాషన్, కిరాణా, గృహోపకరణ వస్తువులను సరసమైన ధరలకే అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ దేశవ్యాప్తంగా 820కి పైగా స్టోర్లను నిర్విరామంగా నిర్వహిస్తోంది.
ఈ పునఃనియామకం వార్తల నేపథ్యంలో ఆగస్టు 24 ఉదయం ట్రేడింగ్లో విశాల్ మెగా మార్ట్ షేరు ధర భారీగా పుంజుకుంది. ఒక్కరోజే ఈ స్టాక్ 8.49% లాభపడి ఇన్వెస్టర్లకు మంచి రాబడినిచ్చింది. గత నెల రోజుల్లో ఈ షేరు 0.62%, గత ఒక సంవత్సర కాలంలో 26.06% తగ్గినప్పటికీ.. తాజా యాజమాన్య నిర్ణయంతో ఇన్వెస్టర్లలో మళ్లీ నమ్మకం నెలకొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
