స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన విశాల్ మెగా మార్ట్ షేర్లు.. ఎగబడి కొంటున్న పెట్టుబడిదారులు
Vishal Mega Mart Doubles Since IPO: గురువారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే విశాల్ మెగా మార్ట్ షేర్లు దుమ్మురేపాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కంపెనీ షేర్లు 6 శాతం కంటే ఎక్కువ పెరిగి రూ. 155.45 స్థాయికి చేరుకున్నాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పెరుగుదలతో పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ కంపెనీ వైపు మళ్లింది. మార్కెట్ నిపుణులు కూడా విశాల్ మెగా మార్ట్ స్టాక్లో ఇంకా మంచి పెరుగుదల అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రత్యేకంగా.. విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ విశాల్ మెగా మార్ట్ షేర్ల లక్ష్య ధరను రూ. 175కి పెంచింది. ఇది బుధవారం ముగింపు ధర నుండి సుమారు 21 శాతం అదనపు లాభాన్ని అందించింది. గతంలో ఈ బ్రోకరేజ్ సంస్థ కంపెనీ షేర్లకు రూ. 142 లక్ష్యాన్ని ఇచ్చింది. తాజా సిఫార్సులో, జెఫరీస్ విశాల్ మెగా మార్ట్పై "బై" రేటింగ్ను కొనసాగించింది. IPO లిస్టింగ్ సమయంలో కంపెనీ షేర్ ధర రూ. 78 కాగా.. ప్రస్తుతం షేర్లు ఇప్పటికే ఆ స్థాయి నుండి సుమారు 80 శాతం పెరిగాయి. మరో ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా విశాల్ మెగా మార్ట్పై ఓవర్వైట్ రేటింగ్ను కొనసాగించింది.షేర్ ధర రూ. 161 లక్ష్యాన్ని ప్రకటించింది. ఈ అంచనాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని విశాల్ మెగామార్టుపై మరింతగా పెంచాయి.

కంపెనీ యొక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు మార్కెట్ను విపరీతంగా ఆకర్షించాయి. ఈ కాలంలో విశాల్ మెగా మార్ట్ లాభం 37.2 శాతం పెరిగి రూ. 206.10 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 150.10 కోట్లుగా నమోదైంది. లాభ మార్జిన్ కూడా 5.8 శాతం నుండి 6.6 శాతంకు మెరుగుపడింది. ఇది కంపెనీ వ్యాపార సామర్థ్యం పెరిగిన సంకేతంగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏటా 21 శాతం పెరిగి రూ. 3,140.30 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 2,596.30 కోట్లుగా ఉంది. ఈ పెరిగిన వృద్ధికి పెరిగిన విక్రయాలు, కొత్త స్టోర్ ప్రారంభాలు, సమర్థవంతమైన ఖర్చు నిర్వహణ కారణమని కంపెనీ మేనేజ్మెంట్ పేర్కొంది.
విశాల్ మెగా మార్ట్ దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్ చైన్గా, మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని తక్కువ ధరల్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తోంది. ఈ వ్యాపార మోడల్ కంపెనీకి స్థిరమైన ఆదాయం, లాభాలను తీసుకువస్తోంది. రాబోయే త్రైమాసికాల్లో కూడా ఇదే రీతిలో వృద్ధి కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద, IPO నుండి ఇప్పటివరకు కంపెనీ షేర్లు 100 శాతం కు పైగా పెరిగినప్పటికీ, విశ్లేషకులు ఇంకా ఈ స్టాక్లో మరింత వృద్ధి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications