Tata: టాటా గ్రూప్ల్లో భారీ కుదుపు.. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా..
టాటా సంస్థల్లో కీలక పాత్ర పోషించిన ఎన్. చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన ఆయన పదవీకాలం ఆకస్మికంగా ముగిసింది. ఈ కాలంలో ఆయన భారతదేశపు అతిపెద్ద వ్యాపారాలు విమానయాన, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, డిజిటల్ వ్యాపారాలు కలిగిన ఒక బృహత్ సంస్థగా తీర్చిదిద్దారు. 63 ఏళ్ల చంద్రశేఖరన్ తన నిర్ణయాన్ని టాటా సన్స్ బోర్డుకు తెలియజేశారని సమాచారం. ఛైర్మన్గా ఆయన పదవీకాలం అధికారికంగా ఫిబ్రవరి 2027 వరకు ముగిసేంత వరకు ఆయన పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది.
చంద్రశేఖరన్ నిష్క్రమణ గ్రూప్లోని అన్ని సంస్థలపై ప్రభావం చూపుతుంది. ఆయన ఇతర టాటా కంపెనీలతో పాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్కు ఛైర్మన్గా ఉన్నారు. 2017లో టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుం గ్రూప్ వ్యాపారాలన్నింటిలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 18న జరగనున్న ఏజీఎం సమావేశంలో టాటా సన్స్లో సుమారు 66% వాటా ఉన్న టాటా ట్రస్ట్స్ ఎలా ఓటు వేస్తుందనే దానిపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా, చంద్రశేఖరన్ పదవిలో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు భావిస్తున్నారు. అసలు సమావేశం జరుగుతుందా లేదా అనే దానిపై కూడా అనిశ్చితి నెలకొంది.

టాటా సన్స్ కీలక వాటాదారులలో ఒకటైన సర్ రతన్ టాటా ట్రస్ట్, విచారణ పెండింగ్లో ఉన్నందున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ప్రస్తుతం నిషేధించారు. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం, సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్ సంయుక్తంగా నామినేట్ చేసిన ట్రస్టీలకు వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఓటు వేసే అధికారం ఉంది. నోయల్ టాటా, డారియస్ ఖంబటా, జహంగీర్ జహంగీర్తో సహా సర్ రతన్ టాటా ట్రస్ట్కు చెందిన కొందరు ట్రస్టీలు సమావేశంలో పాల్గొనడానికి ఛారిటీ కమిషనర్ నుంచి అనుమతి కోరారు. విజయ్ సింగ్ మరియు వేణు శ్రీనివాసన్ ఈ అభ్యర్థనపై సంతకం చేయలేదు.
చంద్రశేఖరన్ పదవీకాలంలో టాటా గ్రూప్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గ్రూప్ అందించిన గణాంకాల ప్రకారం మొత్తం రాబడి FY20లో రూ.7.89 లక్షల కోట్ల నుంచి FY26 నాటికి రూ.16.24 లక్షల కోట్లకు పెరిగింది. పన్ను తర్వాత లాభం రూ.32,000 కోట్ల నుంచి రూ.1.71 లక్షల కోట్లకు, అంటే ఐదు రెట్లకు పైగా పెరిగింది. టాటా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ FY20లో రూ.9.31 లక్షల కోట్ల నుంచి FY26 నాటికి రూ.24.39 లక్షల కోట్లకు పెరిగింది. అయితే FY25లో ఇది రూ.27.85 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్కు నాయకత్వం వహించిన తర్వాత చంద్రశేఖరన్ 2017లో టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించారు. రతన్ టాటా తర్వాత, టాటా కుటుంబం వెలుపల నుంచి ఈ హోల్డింగ్ కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి ప్రొఫెషనల్ మేనేజర్ ఆయనే అయ్యారు.
ఆయన నాయకత్వంలో, టాటా తిరిగి విమానయాన రంగంలోకి ప్రవేశించింది, ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది.యు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, బ్యాటరీల రంగాలలోకి విస్తరించింది. ఈ గ్రూప్ డిజిటల్ వ్యాపారాలు, ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా తన దృష్టిని పెంచింది. ఈ విస్తరణకు భారీ పెట్టుబడులు అవసరమయ్యాయి. కొత్త వ్యాపారాల పనితీరు, మూలధన అవసరాలపై టాటా ట్రస్ట్స్లో విభేదాలకు దారితీసింది. కొత్త వ్యాపారాల పనితీరుపై నోయెల్ టాటా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చంద్రశేఖరన్ పునఃనియామకంపై టాటా సన్స్ బోర్డు ఫిబ్రవరి 24న నిర్ణయాన్ని వాయిదా వేసిందని తెలిసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications