NSE IPO: ఎన్ఎస్ఈ ఐపీఓ వచ్చేస్తోంది.. అప్లై చేయాలా వద్దా..!
దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఐపీఓ, సెప్టెంబర్ 17న ప్రజల కోసం ప్రారంభం కానుంది. ఐపీఓ ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 1,700 - రూ. 1,785 గా నిర్ణయించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 21న ముగియనుంది. ఎన్ఎస్ఈ ఈ ఐపీఓ ద్వారా రూ. 22,561.5 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్ట ధరల శ్రేణి వద్ద కంపెనీ విలువను రూ. 4.42 లక్షల కోట్లుగా అంచనా వేస్తోంది. ఈ 'బుక్-బిల్ట్' ఇష్యూ పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) పద్ధతిలో ఉంటుంది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, MS స్ట్రాటజిక్ (మారిషస్), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, అరండా ఇన్వెస్ట్మెంట్స్ (మారిషస్) వంటి 10 మంది ప్రస్తుత వాటాదారులు గరిష్టంగా 12.64 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. ఇందులో కొత్త షేర్ల జారీ భాగం ఏదీ లేదు.
ఐపీఓ ద్వారా వచ్చే నిధులన్నీ వాటాదారులకే వెళ్లనున్నాయి. ఈ ఐపీఓ ముఖ్య ఉద్దేశ్యం ఓఎఫ్ఎస్ ప్రక్రియను నిర్వహించడం. ఎన్ఎస్ఈ ఈక్విటీ షేర్లను BSEలో లిస్ట్ చేయడం మాత్రమే. జూన్ 2026లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం మొదట 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఇష్యూ పరిమాణాన్ని 15 శాతం తగ్గించారు. ఈ DRHPకి మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI సెప్టెంబర్ 4, 2026న ఆమోదం తెలిపింది. అతిపెద్ద విక్రయ వాటాదారుగా ఉన్న ఎస్బీఐ ఈ OFS ద్వారా గరిష్టంగా 1.59 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ 1.18 కోట్ల షేర్లను, అరండా ఇన్వెస్ట్మెంట్స్ (మారిషస్) 1.12 కోట్ల షేర్లను, MS స్ట్రాటజిక్ (మారిషస్) 1.1 కోట్ల షేర్లను, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 1.05 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, MS స్ట్రాటజిక్ (మారిషస్), బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ OFS వాటాల సంఖ్యను తగ్గించుకున్నాయి. సెప్టెంబర్ 10న దాఖలు చేసిన RHP (రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్) ప్రకారం, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, అరండా ఇన్వెస్ట్మెంట్స్ (మారిషస్), న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ విక్రయించాలనుకుంటున్న షేర్ల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇకపై OFS (ఆఫర్ ఫర్ సేల్) ద్వారా షేర్లను విక్రయించడం లేదు.
NSE IPO నిర్వహణ కోసం మొత్తం 20 మంది మర్చంట్ బ్యాంకర్లను నియమించారు. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, JM ఫైనాన్షియల్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, HSBC సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా), JP మోర్గాన్ ఇండియా, SBI క్యాపిటల్ మార్కెట్స్, ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, అవెండస్ క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, DAM క్యాపిటల్ అడ్వైజర్స్, ఈక్విరస్ క్యాపిటల్, HDFC బ్యాంక్, ICICI సెక్యూరిటీస్, IDBI క్యాపిటల్ మార్కెట్స్ & సెక్యూరిటీస్, IIFL క్యాపిటల్ సర్వీసెస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, నువామా వెల్త్ మేనేజ్మెంట్, పాంటోమాత్ క్యాపిటల్ అడ్వైజర్స్ మరియు 360 ONE WAM ఉన్నాయి.
ఎన్ఎస్ఈ ఒక బలమైన మరియు పేరున్న బ్రాండ్. స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ చేసే వారి సంఖ్య తగ్గితే ఈ సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి సంస్థ తన ఆదాయంలో 78.65% లావాదేవీల ఛార్జీల నుంచి పొందుతోంది. లావాదేవీలు తగ్గితే కంపెనీ ఆదాయంపై ప్రభావం పడుతుంది. ఎన్ఎస్ఈ తన ఆదాయంలో 46.78% తన టాప్ 10 ట్రేడింగ్ సభ్యుల నుంచి పొందుతోంది. ఇది కూడా ఒక రిస్క్ గా తీసుకోచ్చువచ్చు. వాల్యూవేషన్ పరంగా చూస్తే.. బీఎస్ఈ కంటే తక్కువ వాల్యూవేషన్ లోనే ఐపీఓగా వస్తుంది. ఎన్ఎస్ఈ షేర్లు 35 PE మల్టిపుల్ వద్ద లభిస్తుండగా, బీఎస్ఈ షేర్లు 49 PE మల్టిపుల్ వద్ద ట్రేడవుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
