రెండు రోజుల్లో రూ. 26 వేల కోట్లు నష్టపోయిన టీసీఎస్.. లేఆఫ్స్ దెబ్బకు స్టాక్స్ ఢమాల్

భారత అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తాజాగా 12వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించడంతో టెక్ రంగం ఒక్కసారిగా షేక్ అయింది. ఈ ప్రకటన స్టాక్ మార్కెట్ ని ఒక్కసారిగా కుదిపేసింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే TCS షేర్లు రూ. 6,550 కోట్ల పెట్టుబడిదారుల సంపదను కోల్పోయింది. వచ్చే ఏడాది కాలంలో 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంస్థ ప్రకటించిన ఒక రోజు తర్వాత సోమవారం షేర్లు రూ.20 వేల కోట్ల విలువను కోల్పోయిన తర్వాత ఇది జరిగింది. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11.07 లక్షల కోట్లకు పడిపోయింది.

చాలామంది టీసీఎస్‌ను ప్రభుత్వ ఉద్యోగంలా భావిస్తూ..దీంట్లో ఉద్యోగం అంటే జీవితాన్ని సెటిల్ చేసేసుకున్నట్లే అని నమ్మేవారు. సమయానికి జీతం, వేరియబుల్ పే, వృద్ధి అవకాశాలు వంటి అంశాలతో భరోసా కలిగించే కంపెనీగా పేరు సంపాదించింది. అయితే ఈ విధమైన ఉద్యోగ భద్రత ఇక ముందు కనిపించకపోవచ్చని తాజా లేఆప్స్ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ ఉద్యోగాల కోతకు కారణం ఏఐ (Artificial Intelligence) కారణమని చెప్పవచ్చు.

TCS layoffs 2025 TCS share crash TCS stock loss 6550 cr TCS market value drop TCS job cuts news IT layoffs India Indian IT stocks fall TCS retrenchment TCS 12000 employees laid off stock market reaction layoffs TCS investors loss AI impact on IT jobs 2025 6550 AI

మారుతున్న టెక్నాలజీ, ఆటోమేషన్ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్లే టీసీఎస్ 12 వేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఐటీ ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక లాంటి సంకేతం వచ్చినట్లయింది. ఈ ప్రకటన తర్వాత టీసీఎస్ షేర్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,550 కోట్ల మేర తగ్గిపోయింది. అంతకుముందు సోమవారం కూడా కంపెనీ షేర్లపై భారీగా అమ్మకాలు జరగడంతో రూ.20,000 కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. దీంతో రెండు రోజుల్లో మొత్తం రూ.26,550 కోట్ల నష్టం నమోదైంది. ప్రస్తుతం టీసీఎస్ షేర్ NSEలో రూ.3,044 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవాళ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.3,041ని తాకింది.

2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు టీసీఎస్ స్టాక్ దాదాపు 25 శాతం పతనమైంది. నిపుణులు షేర్ ప్రస్తుత స్థాయికి మించిపోయేలా పడిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బ్రోకరేజ్ సంస్థలు టీసీఎస్ లక్ష్యధరలను తక్కువగా రివైజ్ చేశాయి. పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగుల కన్నా.. ఎంత లాభం? ఎంత డెలివరీ అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు, ఏఐ ఆధారిత టెక్ నేపథ్యంలో సంస్థలు ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. తద్వారా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా హై-స్కిల్ కలిగిన వారినే ఎంపిక చేసుకుంటున్నాయి. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలు కూడా కంపెనీలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చుల తగ్గింపుపై బాగా ఫోకస్ పెట్టాయి. ఐటీ ఉద్యోగాల భవిష్యత్తు ఇకపై సంక్షోభంలోకి వెళ్లేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+