TCS Q1 ఫలితాలు వచ్చేశాయి..రూ.12,760 కోట్ల లాభం వచ్చినా తగ్గిన ఆదాయం..డివిడెండ్ ప్రకటన

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఫలితాలను ప్రకటించింది. టీసీఎస్ కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి రూ.12,760 కోట్లకు చేరింది. ఇదే సమయంలో త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయంలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కంపెనీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.12,127 కోట్ల లాభాన్ని సాధించగా..ఈసారి అది రూ.12,760 కోట్లకు చేరుకుంది.

గత త్రైమాసికంతో పోలిస్తే కూడా (రూ.12,224 కోట్లు) లాభం మెరుగైంది. అయితే ఆదాయ పరంగా చూస్తే.. గత త్రైమాసికంలో రూ.64,479 కోట్లు కాగా.. ఇప్పుడు అది స్వల్పంగా తగ్గి రూ.63,437 కోట్లకు చేరుకుంది. స్వల్ప తగ్గుదలను చూసింది. డాలర్ ఆదాయం కూడా 746.5 కోట్ల డాలర్ల నుంచి 742.1 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇక Constant Currency (CC) ఆదాయం 3.3 శాతం తగ్గింది.

TCS Q1 Results TCS net profit TCS PAT Q1 FY25 TCS dividend news TCS Rs 11 per share dividend TCS quarterly earnings Tata Consultancy Services results TCS stock update TCS revenue growth TCS financial performance TCS shareholders update Indian IT sector news TCS earnings report Q1 11 Q1 Q1

కంపెనీ EBIT అంటే వర్కింగ్ లాభం ఈ త్రైమాసికంలో రూ.15,514 కోట్లుగా ప్రకటించింది. EBIT మార్జిన్ 24.3 శాతంగా అంచనా వేసింది. గత త్రైమాసికంతో పోల్చితే మార్జిన్లు కొంత మెరుగయ్యాయి. కంపెనీ మొత్తం కాంట్రాక్ట్ విలువ (TCV) 9.4 బిలియన్ డాలర్లుగా ప్రకటించింది. ఇది మునుపటి త్రైమాసికంలో ఉన్న 12.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే కాస్తా తగ్గింది.అయితే కొత్త సేవలలో మంచి వృద్ధిని కంపెనీ నమోదు చేసింది.

ఈ త్రైమాసికంలో టీసీఎస్ 5,090 మంది కొత్త ఉద్యోగులను తీసుకుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల తొలగింపులు కూడా భారీగానే చేపట్టింది.ఇది గత త్రైమాసికంలో 13.3 శాతం ఉండగా, ఇప్పుడు 13.8 శాతానికి చేరింది. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.13 లక్షలు అని తెలిపింది. కంపెనీ CHRO మిలింద్ లక్కాడ్ తెలిపిన ప్రకారం, టీసీఎస్ అసోసియేట్లు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై 1.5 కోట్ల గంటల పాటు శిక్షణ పొందారు. AI నైపుణ్యాలున్న 1,14,000 మంది ఉద్యోగులు కంపెనీలో ఉన్నారని తెలిపారు.

టీసీఎస్ CEO K. కృతివాసన్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల వల్ల డిమాండ్ మీద ఒత్తిడి ఉంది. అయినప్పటికీ మేము ఖర్చులను తగ్గించడం, సరఫరాదారులను ఏకీకృతం చేయడం, AI ఆధారిత వ్యాపార పరివర్తన ద్వారా కస్టమర్లకు విలువను అందిస్తున్నామని తెలిపారు.

ఇక టీసీఎస్ తన షేర్ హోల్డర్ల కోసం ఒక్కో షేరుకు రూ.11 డివిడెండ్ ప్రకటించింది. దీని రికార్డు తేదీని జూలై 16, 2025గా నిర్ణయించారు. క్లుప్తంగా చూసుకున్నట్లయితే టీసీఎస్ లాభాల్లో స్థిరమైన వృద్ధిని సాధించగా.. ఆదాయంలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. ఉద్యోగ నియామకాలను కొనసాగిస్తూనే.. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు తగిన విధంగా AI ఆధారిత పరిష్కారాలను ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగ తొలగింపులు చేపడుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+