స్టాక్ మార్కెట్‌కు షాక్.. 450 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్..ఇన్వెస్టర్లలో ఆందోళన

భారత స్టాక్ మార్కెట్ గురువారం నాటి ట్రేడింగ్‌ను తీవ్ర ఒత్తిడితో ప్రారంభించింది. అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య రేగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తుండగా, దాని ప్రభావం దేశీయ సూచీలపై స్పష్టంగా కనిపించింది. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనల కారణంగా ప్రారంభ సెషన్ లోనే సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ నష్టాల్లోకి జారుకున్నాయి.

ఉదయం తొలి అరగంట ట్రేడింగ్‌లోనే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సుమారు యాభైకి పైగా పాయింట్లు క్షీణించి 23,355 వద్ద ట్రేడవగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ వందకు పైగా పాయింట్లు నష్టపోయి 74,219 స్థాయికి పడిపోయింది. కేవలం లార్జ్-క్యాప్ షేర్లు మాత్రమే కాకుండా విస్తృత మార్కెట్లోని మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ రంగాలు కూడా నష్టాల్లోనే పయనించడం మార్కెట్లో ఇన్వెస్టర్ల అప్రమత్తతను సూచిస్తోంది.

Stock Market Today Sensex Today Nifty Today Sensex rebounds Nifty 24400 Indian stock market share market news auto stocks rally stock market update BSE Sensex NSE Nifty market recovery auto sector stocks Dalal Street news Indian equities stock market live market closing report investment news 24400 NSE BSE

ఈ పతనంలో ముఖ్యంగా అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం ఎక్కువగా ఉండే ఐటీ, రియల్టీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు అత్యధికంగా నష్టపోయి మార్కెట్‌ను కిందకు లాగాయి. అయితే మార్కెట్ ఇంతలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, వినియోగ వస్తువులు (ఎఫ్‌ఎమ్‌సీజీ), చమురు-గ్యాస్, రసాయన రంగాలు సాపేక్షంగా మెరుగ్గా రాణించి మార్కెట్‌కు కొంతవరకు వెన్నుదన్నుగా నిలిచాయి.

దేశీయంగా చూసుకుంటే మార్కెట్ వర్గాలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. శుక్రవారం ఆర్‌బీఐ తన కీలక వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించనున్న తరుణంలో, దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంక్ ఎలాంటి అంచనాలను వెలువరిస్తుందోనన్న ఆసక్తితో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొత్త కొనుగోళ్లు జరపకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

Also Read

మరోవైపు మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను తాము అడ్డుకున్నామని, పర్షియన్ గల్ఫ్‌లోని ఖేష్మ్ ద్వీపంపై ప్రతీకార దాడులు చేశామని యూఎస్ ప్రకటించిన వెనువెంటనే, ఇరాన్ తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడికి తెగబడటం గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసింది. ఈ పరిణామాల వల్ల బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లలో డౌ జోన్స్, ఎస్&పి 500, నాస్‌డాక్ సూచీలు భారీగా పతమవ్వగా, గురువారం ఉదయం ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పిలు సైతం ఒకటిన్నర శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి.

అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గి బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 96.72 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ఫ్యూచర్స్ లాభాల్లో సాగుతోంది. ఈ గందరగోళ పరిస్థితుల్లోనూ ప్రాథమిక మార్కెట్ (IPO) మాత్రం చురుగ్గా ఉంది; సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, వాహా కెమికల్స్, యూహెచ్‌ఎం వెకేషన్స్ వంటి కంపెనీల ఐపీఓలు గురువారం ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+