స్టాక్ మార్కెట్ టుడే.. RBI నిర్ణయానికి ముందు అలర్ట్ అయిన ఇన్వెస్టర్లు.. లాభనష్టాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ..

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మిశ్రమ ధోరణితో సాగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమీక్షా నిర్ణయాలు వెలువడనుండటం.. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చల పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తుండటంతో మార్కెట్లో జాగ్రత్తతో కూడిన వాతావరణం నెలకొంది. ఉదయం ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ50 సూచీ కొంత పతనమై 24,630 వద్ద కొనసాగగా.. బిఎస్ఈ సెన్సెక్స్ మాత్రం లాభాలతో 78,852 పాయింట్ల వద్ద ట్రేడైంది. అంతకుముందు గిఫ్ట్ నిఫ్టీ సంకేతాలు కూడా మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభమవుతుందని సూచించాయి.

ఈ రోజు ట్రేడింగ్‌లో నిఫ్టీ50 పరిధిలోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీ, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. రంగాలు వారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ సిమెంట్ సూచీలు ఒత్తిడికి గురవ్వగా, నిఫ్టీ మెటల్ సూచీ మాత్రం మెరుగైన పనితీరును కనబరిచింది. విస్తృత మార్కెట్లో మిడ్‌క్యాప్ సూచీ స్వల్ప నష్టంతో.. స్మాల్‌క్యాప్ సూచీ లాభాలతో ట్రేడ్ అయ్యాయి. ఆర్‌బిఐ కీలక నిర్ణయాలు వెలువడే వరకు ఇన్వెస్టర్లు పెద్దగా కొత్త పొజిషన్లు తీసుకోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Sensex Today Nifty Today Stock Market Today RBI Policy RBI MPC Repo Rate Sensex Live Nifty Live Indian Stock Market Share Market News BSE Sensex NSE Nifty Equity Market RBI Interest Rate Business News RBI RBI MPC RBI

అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు నష్టపోగా.. ఆస్ట్రేలియా సూచీ లాభపడింది. అంతకుముందు అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్, డౌ జోన్స్ సూచీలు భారీ లాభాలతో ముగియడం దేశీయ మార్కెట్‌కు కొంత ఉపశమనాన్ని ఇచ్చే అంశం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 84 డాలర్లు దాటగా.. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు కూడా పెరిగాయి.

Also Read

కార్పొరేట్ రంగానికి సంబంధించి ఈరోజు పలు ప్రధాన కంపెనీలు తమ తొలి త్రైమాసిక (Q1) ఫలితాలను ప్రకటించనున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జిసి, మారికో, పిడిలైట్, గోద్రెజ్ ప్రాపర్టీస్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి సంస్థలు తమ ఆర్థిక గణాంకాలను వెల్లడించనుండటంతో ఆయా షేర్లలో కదలికలు కనిపించే అవకాశం ఉంది. ప్రైమరీ మార్కెట్‌లోనూ ఐపీఓ కార్యకలాపాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.

భారతదేశపు ప్రముఖ కాఫీ పరికరాలు, సేవల ప్రదాత అయిన 'కాపీ మెషీన్స్' (Kaapi Machines) సంస్థ ప్రైవేట్ ఈక్విటీ మద్దతు కలిగిన 'సెడ్నా హోరెకా' (Sedna HoReCa) నుండి రూ. 50 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని సమీకరించింది. ఈ పెట్టుబడితో పాటు ఇరు సంస్థలు ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి కూడా ప్రవేశించాయి. దేశంలో వేగంగా పెరుగుతున్న కాఫీ సంస్కృతి, హోరేకా (హోటళ్ళు, రెస్టారెంట్లు, కేఫ్‌లు) రంగానికి ఉన్న డిమాండ్‌ను వినియోగించుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుంది.

ఈ తాజా నిధుల ద్వారా కాపీ మెషీన్స్ తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడంతో పాటు.. తయారీ సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా కంపెనీకి చెందిన టెక్నాలజీ విభాగం, వేర్‌హౌసింగ్ వ్యవస్థ, సేవా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ నిధులను వెచ్చించనుంది. సెడ్నా హోరెకాకున్న విస్తృత సరఫరా వ్యవస్థ, పంపిణీ సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని తమ వినియోగదారులకు అనుబంధ ఉత్పత్తి విభాగాలలో సరికొత్త అవకాశాలను అందించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది.

2007లో స్థాపించబడిన కాపీ మెషీన్స్ ప్రస్తుతం మార్కెట్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఈ సంస్థకు ఫిలిప్స్, విప్రో కన్స్యూమర్ కేర్, స్టాన్లీ బ్లాక్ & డెక్కర్ వంటి ప్రముఖ బ్రాండ్లలో పనిచేసిన అనుభవం ఉన్న XLRI పూర్వ విద్యార్థి, ఎండీ & సీఈఓ అభినవ్ మాథుర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు ప్రపంచ కాఫీ పరిశ్రమలో ప్రసిద్ధుడైన శ్రీ నిల్స్ ఎరిక్సెన్ (డైరెక్టర్) భాగస్వామిగా ఉన్నారు. నిల్స్ ఎరిక్సెన్ ప్రొఫెషనల్ కాఫీ గ్రైండర్ల తయారీలో గ్లోబల్ లీడర్ అయిన హెమ్రో గ్రూప్ ప్రారంభకులలో ఒకరు కాగా, స్పెషాలిటీ కాఫీ అసోసియేషన్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+