చరిత్రలోనే అతిపెద్ద క్రాష్ మొదలైంది.. స్టాక్ మార్కెట్ పతనంపై Robert Kiyosaki షాకింగ్ కామెంట్స్..
ప్రముఖ ఆర్థిక వేత్త, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి అంతర్జాతీయ పెట్టుబడిదారులను మరొకసారి తీవ్ర ఆందోళనకు గురిచేసే హెచ్చరికలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చరిత్రలోనే అతిపెద్ద పతనం 2026లోనే ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా స్పందించిన ఆయన, తాను 2002లో ప్రచురించిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' పుస్తకంలోనే ఈ ఆర్థిక సంక్షోభం గురించి ముందే ఊహించానని గుర్తుచేశారు.
ఈ తాజా మాంద్యం మొదట యూరప్, జపాన్ దేశాలలో ప్రారంభమై, ఆ తర్వాత క్రమంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు విస్తరిస్తుందని ఆయన విశ్లేషించారు. అంతర్జాతీయ స్టాక్, బాండ్ మార్కెట్లను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని, అయితే సరైన వ్యూహంతో ఈ పతనం నుండి తమ సంపదను కాపాడుకోవడమే కాకుండా ఆర్థికంగా లాభపడవచ్చని కూడా ఆయన పెట్టుబడిదారులకు సూచించారు.

ఈ భారీ క్షీణతకు కేవలం ఒక్కటి మాత్రమే కాకుండా అనేక అంతర్జాతీయ పరిణామాలు కారణమవుతాయని కియోసాకి వివరించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉపాధి రంగానికి ఎదురవుతున్న ముప్పు, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, అమెరికాపై నిరంతరం పెరుగుతున్న అప్పుల భారం మరియు 'బేబీ బూమ్' తరం వయస్సు పైబడి పెద్ద ఎత్తున పదవీ విరమణ చేయడం వంటి అంశాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని తెలిపారు. పూర్వం సంభవించిన మహమ్మారి ఆర్థిక మాంద్యం ఏకంగా 25 సంవత్సరాల పాటు కొనసాగిందని గుర్తుచేసిన ఆయన, ఆ కష్టకాలంలో కూడా కెన్నెడీ కుటుంబం వంటి చతురత కలిగిన ఇన్వెస్టర్లు అత్యంత లాభదాయకమైన మార్గాల్లో తమ సంపదను పెంపొందించుకున్నారని ఉదాహరణగా పేర్కొన్నారు.
ఈ పరిస్థితి నుండి గట్టెక్కడానికి పెట్టుబడిదారులకు ఇంకా సమయం మిగిలే ఉందని కియోసాకి అశాభావం వ్యక్తం చేశారు. సంక్షోభ భయంతో ప్రజలు బ్యాంకుల నుండి నగదును ఉపసంహరించుకునే పరిస్థితి రాకముందే, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ బ్యాంకులు ముద్రిస్తున్న కాగితపు కరెన్సీని 'నకిలీ ద్రవ్యం'గా అభివర్ణించిన ఆయన, బ్యాంకు డిపాజిట్లు లేదా సాధారణ నగదు నిల్వలపై ఆధారపడకుండా రియల్ ఎస్టేట్, చమురు బావులు వంటి నిరంతరం ఆదాయాన్ని ఇచ్చే రంగాలలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
వీటితో పాటు బంగారం, వెండి, బిట్కాయిన్ (Bitcoin) వంటి డిజిటల్, భౌతిక ఆస్తులను పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలని (Accumulate) పునరుద్ఘాటించారు. 2026 చివరి నాటికి బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో గణనీయంగా పెరుగుతాయని విశ్లేషిస్తూ, ప్రతికూల సమయాల్లో ఇవే అసలైన రక్షణగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

