రెండో రోజు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. షేర్ మార్కెట్‌కు మరోసారి అమ్మకాల సెగ..

దేశీయ స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల పరంపర మంగళవారం కూడా కొనసాగింది. పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల విజృంభణ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో ఇరు ప్రధాన సూచీలు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి.

ఉదయం ప్రారంభ సెషన్‌లో బిఎస్ఇ సెన్సెక్స్ 76,012.11 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకినప్పటికీ.. ఆ తర్వాత తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైంది. చివరికి సెన్సెక్స్ 555 పాయింట్లు నష్టపోయి 75,577.58 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ50 ప్రారంభంలో 23,758.95 పాయింట్ల గరిష్ట స్థాయికి ఎగబాకినప్పటికీ, మార్కెట్ ముగిసే సమయానికి 144 పాయింట్లు పడిపోయి 23,635.10 వద్ద ముగిసింది.

Closing Bell Stock Market Today Share Market Today Sensex Today Sensex falls 555 points Nifty Today banking stocks IT stocks bank shares IT shares selling pressure market sell-off Indian stock market stock market closing Sensex closing Nifty closing share market news banking sector IT sector market update Closing Bell Stock Market Today Sensex Today 555 IT

పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా-ఇరాన్ వివాదం మరింత తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ నుండి ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $100 సమీపానికి చేరడం భారత ఆర్థిక వ్యవస్థపై దిగుమతుల భారాన్ని పెంచేలా చేసింది. ఈ పరిణామం పెట్టుబడిదారులలో భయాలను పెంచడంతో పాటు ప్రధాన ఐటీ, బ్యాంకింగ్ రంగాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఐటీ సూచీ 0.37 శాతం నష్టపోగా, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.54 శాతం క్షీణించింది.

Also Read

నిఫ్టీ50 సూచీలోని 50 కంపెనీలలో 31 స్టాక్‌లు నష్టాలతో ముగియగా, 17 స్టాక్‌లు మాత్రమే లాభాలను ఆర్జించాయి. ఎస్‌బిఐ లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు చెరో 2 శాతం మేర పతనమై ప్రధానంగా మార్కెట్‌ను కిందకు లాగాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు కూడా చెరో 1 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. ప్రతికూల మార్కెట్‌లోనూ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), హిందూస్థాన్ యూనిలీవర్ (HUL) షేర్లు తలో 1 శాతం కంటే ఎక్కువ లాభపడి టాప్ గైనర్లుగా నిలిచాయి.

సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ, ప్రాథమిక (IPO) మార్కెట్ కాస్త జోరుగా సాగింది. మంగళవారం మెయిన్‌బోర్డ్ విభాగంలో మూడు కొత్త ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చాయి:

కనోహర్ ఎలక్ట్రికల్స్
ప్రసోల్ కెమికల్స్
గ్లాస్ వాల్ సిస్టమ్స్

మరొకవైపు, ప్రణవ్ కన్స్ట్రక్షన్స్, అపనా లాజిస్టిక్స్ ఐపీఓల సబ్‌స్క్రిప్షన్ నేడు రెండో రోజుకు చేరింది. ఈ రెండు కంపెనీలు ఐపీఓ ద్వారా ప్రైమరీ మార్కెట్ నుండి వరుసగా రూ. 351.03 కోట్లు, రూ. 34.14 కోట్లు సమీకరించేందుకు బిడ్లను ఆహ్వానిస్తున్నాయి. అలాగే క్వాలియన్స్ ఇంటర్నేషనల్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఈరోజుతో మూడో రోజుకు చేరుకుంది. మొత్తంగా, క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలే రాబోయే రోజుల్లో భారతీయ స్టాక్ మార్కెట్ల దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+