చివరి నిమిషంలో దుమ్మురేపిన స్టాక్ మార్కెట్.. ఒకే ఒక వార్తతో పైకి ఎగబాకిన నిఫ్టీ, సెన్సెక్స్..

మధ్యాహ్నం వరకు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలో కొట్టుమిట్టాడిన భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చివరి గంటలో ఊహించని మలుపు తీసుకుంది. రోజు కనిష్ట స్థాయిల వద్ద బలహీనంగా నిలిచిన మార్కెట్లలో అకస్మాత్తుగా కొనుగోళ్ల వెల్లువ కనిపిచింది. నిఫ్టీ ప్రధానంగా తన రోజువారీ కనిష్ట స్థాయి నుండి ఏకంగా 200 పాయింట్లకు పైగా కోలుకుని 24,300 స్థాయికి ఎగువన ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 77,656 వద్ద నిలవగా.. నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 24,335 వద్ద స్థిరపడింది. చివరి గంటలో వచ్చిన ఈ భారీ పునరాగమనం సూచీలను రెండు వారాల గరిష్ట స్థాయికి చేర్చింది.

మార్కెట్ ఇండెక్స్ ఇంత వేగంగా కోలుకోవడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో (ఎల్&టి) వంటి భారీ వెయిటేజీ ఉన్న దిగ్గజ స్టాక్‌లు కీలక పాత్ర పోషించాయి. సులభంగా చెప్పాలంటే, సెన్సెక్స్, నిఫ్టీలో ప్రతి స్టాక్‌కు సమాన వెయిటేజ్ ఉండదు. రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి గణనీయమైన వెయిటేజ్ ఉన్న స్టాక్‌లు పెరిగితే.. అవి మొత్తం ఇండెక్స్‌ను పైకి లాగగలవు. మార్కెట్ అంతర్గత పరిస్థితి పూర్తిగా బలంగా లేనప్పటికీ.. నిఫ్టీ, సెన్సెక్స్ బలమైన లాభాలతో ముగియడానికి ఇదే కారణం.

24335 116 50 Nifty today Nifty closing Nifty 24 335 Nifty rises 116 points Nifty gains Nifty 50 Nifty 50 stocks stock market today stock market closing share market today Indian stock market market closing

నిఫ్టీ 50లోని 35కు పైగా షేర్లు లాభాల్లో ముగియగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, మాక్స్ హెల్త్‌కేర్ అగ్రగామిగా నిలిచాయి. ఇండెక్స్‌ను భారీ స్టాక్‌లు పైకి లాగినప్పటికీ, బ్యాంకింగ్ ఇండెక్స్ మాత్రం పూర్తిగా మద్దతు ఇవ్వలేకపోయింది. నిఫ్టీ బ్యాంక్ 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,514 వద్ద ముగిసింది. అయితే మిడ్‌క్యాప్ విభాగంలో భారీ కొనుగోళ్లు జరిగి మిడ్‌క్యాప్ ఇండెక్స్ 346 పాయింట్లు పెరిగింది. ఇందులో ఇండస్ టవర్స్, లారస్ ల్యాబ్స్, IREDA, ఏంజెల్ వన్ స్టాక్‌లు మంచి లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా IREDA షేరు చివరి గంటలో అనూహ్యంగా పుంజుకుని 5 శాతం లాభపడింది.

Also Read

ఈ ట్రేడింగ్ సెషన్ మరొక విశేషానికి వేదికైంది. కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) విధానంలో ముగిసిన మొదటి ఆగస్టు డెరివేటివ్స్ సిరీస్ ఇది. ఈ సిరీస్‌లో నిఫ్టీ మొత్తంగా 1.5 శాతం లాభాన్ని నమోదు చేసింది. చివరి నిమిషాల్లో జరిగే ధరల తీవ్ర హెచ్చుతగ్గులను తగ్గించి సరైన ముగింపు ధరను నిర్ణయించడానికి ఈ వేలం సెషన్ తోడ్పడింది. అలాగే అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలు, బలపడిన రూపాయి విమానయాన, ఫైనాన్స్ రంగానికి ఊతమిచ్చాయి. ఏవియేషన్ ఇంధన ఖర్చులు తగ్గుతాయనే అంచనాలతో ఇండిగో షేరుతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ కూడా 2 శాతం లాభపడ్డాయి.

వ్యక్తిగత స్టాక్‌ల విషయానికి వస్తే.. వొడాఫోన్ ఐడియా భారీ ట్రేడింగ్ వాల్యూమ్‌లతో 8 శాతం ఎగబాకగా, పేటీఎం దాదాపు ఐదేళ్ల తర్వాత రూ. 1,700 స్థాయికి ఎగువన ముగిసి 6 శాతం లాభాన్ని అందుకుంది. మరోవైపు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కొనుగోలు వార్తల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరు 3 శాతం పడిపోగా.. ప్రభుత్వ ఆఫర్ ఫర్ సేల్ (OFS) ప్రభావంతో హిందుస్థాన్ కాపర్ 7 శాతం నష్టపోయింది. DIPAM స్పష్టత ఇచ్చినప్పటికీ హిందుస్థాన్ జింక్ కూడా 2 శాతం తగ్గింది.

అంతిమంగా Stock Market సూచీలు బలమైన లాభాలతో ముగిసినప్పటికీ.. మార్కెట్ అంతర్లీన విస్తృతి (Market Breadth) మాత్రం బలహీనంగానే ఉంది. పెరిగిన ప్రతి 4 స్టాక్‌లకు 5 స్టాక్‌లు నష్టపోవడం అడ్వాన్స్-డిక్లైన్ నిష్పత్తి 4:5గా ఉండటాన్ని సూచించింది. అంటే మార్కెట్ ర్యాలీ విస్తృత స్థాయి భాగస్వామ్యంతో జరగలేదు. కాబట్టి చివరి గంటలో కనిపించిన ఈ ఊపు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందా లేక ఇది కేవలం డెరివేటివ్స్ సిరీస్ ముగింపు సందర్భంగా జరిగిన తాత్కాలిక పునరాగమనమా అనేది తదుపరి సెషన్‌లో స్పష్టం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+