రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. చివరి 20 నిమిషాల్లో స్టాక్ మార్కెట్ ర్యాలీ.. నేటి ట్రేడింగ్ హైలైట్స్ ఇవే..

Stock Market Closing Bell: వరుసగా రెండు రోజుల పాటు పతనమైన భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాటి ట్రేడింగ్ ముగింపు సమయానికి బలమైన కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ముగిసాయి. ఉదయం పూట ఆరంభ ట్రేడింగ్‌లో మూడో రోజు కూడా పతనం తప్పదేమోనన్న ఆందోళన ఇన్వెస్టర్లలో వ్యక్తమైనప్పటికీ, రోజు గడిచేకొద్దీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎమ్‌సిజీ (FMCG) రంగాల షేర్లలో తక్కువ ధరల వద్ద వెల్లువెత్తిన కొనుగోళ్లు సూచీలను ఆదుకున్నాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 333 పాయింట్లు పుంజుకుని 74,336 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచీ 99 పాయింట్లు పెరిగి 23,218 స్థాయికి చేరుకుని, అత్యంత కీలకమైన 23,200 మద్దతు స్థాయిని నిలబెట్టుకోగలిగింది. అమెరికా కేంద్రీయ బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ జారీ చేయబోయే ఎఫ్‌ఓఎంసి (FOMC) వడ్డీ రేట్ల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొనడంతో పెట్టుబడిదారులు అచితూచి వ్యవహరించారు. దీనివల్ల మార్కెట్ ముగింపు వద్ద పెరిగిన మరియు తగ్గిన షేర్ల సంఖ్య దాదాపు సమానంగా నమోదు కావడంతో మార్కెట్ బ్రెడ్త్ తటస్థంగా ముగిసింది.

Stock Market Today Stock Market Update Sensex Today Nifty Today Sensex 333 Points Nifty Gains 99 Points Nifty Above 23200 Stock Market Closing Closing Bell Share Market Today Sensex Nifty Stock Market Rally Late Session Rally Indian Stock Market Stock Market Today Stock Market Update Sensex Today Nifty Today Sensex 333 Points Nifty 99 Points Nifty 23200 Stock Market Closing Closing Bell Share Market Today Sensex Nifty Stock Market Rally 20

లార్జ్‌క్యాప్ సూచీలు కోలుకున్నప్పటికీ మిడ్‌క్యాప్ విభాగం నిరాశపరిచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 4 పాయింట్ల స్వల్ప క్షీణతతో 60,874 వద్ద ముగిసింది. ముఖ్యంగా మిడ్‌క్యాప్ విభాగంలో ప్రీమియర్, కళ్యాణ్ జ్యువెలర్స్, నిప్పన్ లైఫ్ మరియు సోనా బీఎల్‌డబ్ల్యూ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని నష్టాల్లో ముగిశాయి. మరోవైపు, మార్కెట్‌ను పతనం నుండి గట్టెక్కించడంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు కీలక పాత్ర పోషించాయి.

నిఫ్టీ బ్యాంక్ సూచీ ఏకంగా 498 పాయింట్లు ఎగబాకి 56,292 స్థాయి వద్ద ముగిసింది. నిఫ్టీకి ప్రధానంగా ఐటీసీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అతిపెద్ద కంట్రిబ్యూటర్లుగా నిలిచాయి. ఇవే కాకుండా, దిగువ స్థాయిలలో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బిఐ లైఫ్ వంటి ఇన్సూరెన్స్ షేర్లు 3 శాతం వరకు లాభపడగా, గోల్డ్ లోన్ రంగానికి చెందిన ముత్తూట్ ఫైనాన్స్ షేరు 2 శాతం లాభాన్ని నమోదు చేసింది.

Also Read

అయితే, బ్యాంక్, ఎఫ్‌ఎమ్‌సిజీ రంగాల ర్యాలీకి ఐటీ రంగానికి చెందిన షేర్లు ప్రతిబంధకంగా మారాయి. నిఫ్టీ పతనమైన టాప్ ఐదు స్టాక్‌లలో నాలుగు ఐటీ రంగానికి చెందిన కంపెనీలే కావడం గమనార్హం. టీసీఎస్ (TCS), విప్రో, ఇన్ఫోసిస్ మరియు టెక్ మహీంద్రా షేర్లలో సాగిన తీవ్ర విక్రయాలు మార్కెట్ మరింత ఎత్తుకు చేరకుండా లాభాలను పరిమితం చేశాయి. ఇక కార్పొరేట్ మరియు నిర్దిష్ట షేర్లలో భారీ కదలికలు నమోదయ్యాయి.

పతంజలి ఫుడ్స్ భారీ ట్రేడింగ్ వాల్యూమ్‌తో 7 శాతం ఎగబాకింది. భీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ (IRDAI) నిబంధనల పత్రం కేవలం మార్గదర్శకమేనన్న అంచనాలతో పీబీ ఫిన్‌టెక్ 5 శాతం పెరిగింది. యూపీఐ ఎండీఆర్ (MDR) రుసుముల వర్తింపు వార్తల నేపధ్యంలో డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం షేరు 4 శాతం లాభపడగా, పోటీ ప్లాట్‌ఫారమ్ పైన్ ల్యాబ్స్ షేరు 4 శాతం నష్టపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+