స్టాక్ మార్కెట్‌కు పొంచి ఉన్న పెను ప్రమాదం.. కొంపలు ముంచబోతున్న US Bond Yield

Stock Market Alert: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అశాంతి, చమురు ధరకు రెక్కలు రావడం వంటి కారణాలతో ఇప్పటికే ఊగిసలాడుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లపై మరో భారీ ప్రమాదం వేగంగా ముంచుకొస్తోంది. అమెరికా 10-ఏళ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడి వేగంగా పెరిగి 4.81 శాతానికి చేరుకుంది. బుధవారం నాడు ఈ రాబడి 3 బేసిస్ పాయింట్లు పెరగగా.. ఫిబ్రవరి 27 నాటి 3.8 శాతం స్థాయితో పోలిస్తే కేవలం కొన్ని నెలల్లోనే బాండ్ ఈల్డ్స్ ఏకంగా ఒక శాతం పాయింట్ పుంజుకోవడం ప్రపంచ ఆర్థిక విపణులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అదే సమయంలో రెండేళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడి 5 బేసిస్ పాయింట్లు పెరిగి 4.41 శాతానికి చేరింది.

జెఫరీస్ సీనియర్ మార్కెట్ వ్యూహకర్త క్రిస్టోఫర్ వుడ్ తన వారపు పరిశోధనా నోట్ "గ్రీడ్ అండ్ ఫియర్" లో విశ్లేషిస్తూ, 10-ఏళ్ల యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 5 శాతం మార్కును దాటితే గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఊహించని రీతిలో భారీ పతనం సంభవించడం ఖాయమని స్పష్టం చేశారు. స్వల్పకాలంలో ప్రపంచ ఈక్విటీలకు అతిపెద్ద ముప్పు ఇదేనని ఆయన హెచ్చరించారు. బాండ్ దిగుబడులు పెరుగుతున్న కొద్దీ సురక్షిత పెట్టుబడులుగా పరిగణించే యూఎస్ ప్రభుత్వ బాండ్లు మరింత ఆకర్షణీయంగా మారతాయి. ఇది ఈక్విటీల నుండి బాండ్ మార్కెట్‌లోకి నిధులు తరలిపోవడానికి దారితీస్తుంది.

US 10 year bond yield US Treasury yield 5 percent Chris Wood warning Chris Wood Jefferies US bond yield today Treasury yield market impact US 10 year yield 5 stock market correction global stock market risk Sensex Nifty impact FII outflows India bond yield vs stocks US interest rates Fed rate outlook Treasury yields and Indian stocks US 10 Year Bond Yield US Treasury Yield 5 Chris Wood 5

బాండ్ దిగుబడుల అకస్మాత్తు పెరుగుదలకు అనేక అంశాలు దోహదపడుతున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరిగి అమెరికాలో ద్రవ్యోల్బణ ఆందోళనలు మళ్లీ ఎక్కువయ్యాయి. అలాగే రాబోయే ఉద్యోగ మార్కెట్ డేటా మరియు అమెరికా యొక్క క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితి కూడా ఈ ఒత్తిడిని పెంచుతున్నాయి. పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం, అప్పుల భారాన్ని తట్టుకోవడానికి అమెరికా మరిన్ని బాండ్లను జారీ చేయాల్సి వస్తోంది. విపణిలో బాండ్ల సరఫరా పెరగడంతో కొనుగోలుదారులు అధిక రాబడులను డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు గత 12 త్రైమాసికాలుగా నామమాత్రపు జీడీపీ వృద్ధి సగటున 5.9 శాతంగా ఉండటం కూడా రాబడుల పెంపునకు శక్తినిస్తోంది.

Also Read

మరోవైపు గ్లోబల్ కన్సల్టెన్సీ డివెర్ గ్రూప్ సీఈఓ నైజెల్ గ్రీన్ ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల విస్తరణ కోసం ప్రైవేట్ టెక్ కంపెనీలు వందల బిలియన్ల డాలర్ల అప్పులు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం మరియు ప్రైవేట్ దిగ్గజాలు నిధుల సమీకరణ కోసం ఏకకాలంలో పోటీ పడటం బాండ్ ఈల్డ్స్‌ను మరింత పైకి నెడుతోంది. ఈ భయాలు కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. జపాన్ 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ దిగుబడి 1996 తర్వాత తొలిసారిగా 3 శాతానికి చేరుకోగా, యూకే 30 ఏళ్ల బాండ్ల రాబడులు 1998 తర్వాత అత్యధిక స్థాయికి చేరడం ప్రపంచవ్యాప్త తీవ్రతకు నిదర్శనం.

భారతీయ మార్కెట్లపై దీని ప్రభావం గురించి జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ సీనియర్ విశ్లేషకులు వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ.. యూఎస్ బాండ్ రాబడులు 5 శాతానికి చేరితే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతదేశం వంటి వర్ధమాన మార్కెట్ల నుండి నిధులను ఉపసంహరించి అమెరికా బాండ్ల వైపు తరలిస్తారని తెలిపారు. ఇది భారత రూపాయి విలువపై ఒత్తిడి పెంచడంతో పాటు దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల దాడిని తీవ్రతరం చేస్తుంది. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ విశ్లేషణ ప్రకారం, భారతీయ సూచీ నిఫ్టీ-50 ప్రస్తుతం సాంకేతిక ధోరణిలో బలహీనపడింది. నిఫ్టీ పతనం విషయంలో 23,800 స్థాయి అత్యంత కీలకమైన మద్దతుగా పనిచేస్తుందని, మార్కెట్ తిరిగి కోలుకోవాలంటే నిఫ్టీ మొదట 24,000, ఆ తదుపరి 24,200 స్థాయిలను అధిగమించాల్సి ఉంటుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+