ఈ స్టాక్స్ మీద కన్నేసి ఉంచండి.. మండే స్టాక్ మార్కెట్ తెరుచుకోగానే ఈ కంపెనీల షేర్లలో గట్టి కదలికలు..
గత శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత పలు కంపెనీలకు సంబంధించి కీలక వార్తలు వెలువడ్డాయి. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి ఈ వార్తలు ఆయా కంపెనీల షేర్ల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. సోమవారం నాడు ఇన్వెస్టర్లు గమనించాల్సిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి. ఈ 14 కంపెనీల గురించి కీలక వార్తలకు సంబంధించి రేపు stock market తెరుచుకోగానే కదలికలు కనిపిస్తాయి.
టాటా గ్రూప్నకు చెందిన గృహోపకరణాల దిగ్గజం వోల్టాస్.. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గతేడాయితో పోలిస్తే కంపెనీ ఏకీకృత లాభం రూ. 140 కోట్ల నుండి రూ. 214 కోట్లకు చేరగా, ఆదాయం కూడా 19 శాతం పెరిగి రూ. 4,674 కోట్లను తాకింది. అలాగే, ప్రముఖ ఎఫ్ఎంసిజి సంస్థ పతంజలి కూడా మొదటి త్రైమాసికంలో బలమైన ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ. 180 కోట్ల నుండి రూ. 336 కోట్లకు పెరగడమే కాకుండా, FY27 మరియు FY26 సంవత్సరాలకు గానూ మధ్యంతర డివిడెండ్లను కూడా ప్రకటించింది.

ప్రభుత్వ రంగ సంస్థల విషయానికొస్తే.. NMDC స్టీల్ తన మొదటి త్రైమాసిక ఫలితాలలో లాభంలో 97.6 శాతం భారీ వృద్ధిని సాధించి రూ. 50.51 కోట్లను నమోదు చేసింది. దీనితో పాటు ఆదాయం రూ. 3,661.84 కోట్లకు పెరిగింది. మరోవైపు మాతృ సంస్థ అయిన NMDC ఏకీకృత నికర లాభం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 2,007 కోట్లకు, ఆదాయం రూ. 6,795 కోట్లకు చేరింది.
కొన్ని కంపెనీల లాభాలు తగ్గినప్పటికీ.. ఆదాయంలో వృద్ధి కనిపించింది. జూపిటర్ వ్యాగన్స్ నికర లాభం 13.6 శాతం తగ్గి రూ. 28.3 కోట్లకు పరిమితమైనప్పటికీ.. రాబడి మాత్రం 46 శాతం పెరిగి రూ. 670.7 కోట్లకు చేరింది. బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం 25.76 శాతం పెరిగి రూ. 19.04 కోట్లకు, ఆదాయం 15 శాతం పెరిగి రూ. 176.68 కోట్లకు చేరింది. మరోపక్క ఎడ్యుటెక్ సంస్థ ఫిజిక్స్ వాలా తన నికర నష్టాన్ని క్రితం ఏడాది ఉన్న రూ. 120.5 కోట్ల నుండి రూ. 77.6 కోట్లకు తగ్గించుకోగలిగింది.
అయితే, కొన్ని కంపెనీలు బలహీన ఫలితాలు, నియంత్రణ చర్యలను ఎదుర్కొన్నాయి. కొచ్చిన్ షిప్యార్డ్ నికర లాభం 27.7 శాతం తగ్గి రూ. 135.8 కోట్లకు, ఆదాయం 6.9 శాతం తగ్గి రూ. 910 కోట్లకు పడిపోయింది. బోరోసిల్ నికర లాభం 26.4 శాతం తగ్గి రూ. 13 కోట్లకు, ష్నైడర్ ఎలక్ట్రిక్ నికర లాభం ఏకంగా 69.84 శాతం తగ్గి రూ. 12 కోట్లకు పడిపోయింది. అలాగే జాగిల్ ప్రీపెయిడ్ నికర లాభంలో 33 శాతం క్షీణత నమోదైంది.
నియంత్రణ, తనిఖీల విషయానికి వస్తే, హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ FTO-3 కేంద్రంలో USFDA నిర్వహించిన తనిఖీ ముగిసి.. 4 పరిశీలనలతో ఫారం 483 జారీ అయింది. డిపాజిట్ వడ్డీ రేట్లు, సెక్యూరిటైజేషన్ నిబంధనల ఉల్లంఘనకు గానూ ఇండస్ ఇండ్ బ్యాంక్పై ఆర్బిఐ రూ. 59.20 లక్షల జరిమానా విధించింది. పాలసీబజార్ తనిఖీ అనంతర పరిశీలనలపై ఐఆర్డీఏఐ నుండి షో-కాజ్ నోటీసు అందుకోగా, నిర్ణీత గడువులోగా తగిన సమాధానం దాఖలు చేస్తామని సంస్థ తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
