దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి లేటెస్ట్ గా ఓ వార్త బయటకు వచ్చింది.SBI త్వరలో రూ. 25 వేల కోట్ల క్వాలిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్మెంట్ (QIP) ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఈ అతి పెద్ద వ్యాపార ప్రతిపాదనకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ రోజు వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (QIP) మార్గం ద్వారా ఎస్బీఐ రూ.25,000 కోట్ల వరకు సేకరించడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. పూర్తిగా సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఇష్యూ దేశంలోని సంస్థాగత పెట్టుబడిదారులకు అతిపెద్ద వాటా అమ్మకం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ కథనంపై State Bank of India నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
బయటకు వచ్చిన నివేదిక ప్రకారం SBI యొక్క QIP ధర ఒక్కో షేరుకు రూ. 790 నుండి రూ. 800 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత మార్కెట్ ధర నుండి 2-3% తగ్గింపుగా ఉంది. ఈ QIP స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారవచ్చు.
కాగా దీనిపై 2025 మే నెలలో సెబీ ద్వారా ఆమోదం కూడా పొందింది. QIP/ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) లేదా ఏదైనా ఇతర అనుమతించబడిన మోడ్ ద్వారా FY2026లో రూ. 25 వేల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పొందేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..సెబీ బోర్డు నుంచి పర్మిషన్ పొందింది.

తాజా నివేదికల ప్రకారం LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఈ QIPలో దాదాపు రూ. 7 వేల కోట్ల యాంకర్ బిడ్కు ముందుకు రావచ్చని సమాచారం. దీనితో పాటు దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుండి ఈ QIPకి మంచి డిమాండ్ కూడా ఉంది. యాంకర్ బిడ్ అనేది యాంకర్ బిడ్-కమ్-ఛాలెంజ్ అనే ప్రక్రియలో ఒక భాగం. ఇది సాధారణంగా వేలం ప్రక్రియలలో ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో, ఒక ఇన్వెస్టర్ యాంకర్ బిడ్డర్గా ఎంపిక అవుతాడు. తరువాత ఇతర బిడ్డర్లు ఆ బిడ్ కంటే ఎక్కువ బిడ్ వేయడానికి అవకాశం ఉంటుంది. చివరికి ఎక్కువ బిడ్ చేసిన వ్యక్తి ఆ వస్తువు లేదా సేవను పొందుతాడు.
ఉదాహరణకు ఒక బ్యాంకు తన మొండి బకాయిలను విక్రయించడానికి యాంకర్ బిడ్-కమ్-ఛాలెంజ్ ప్రక్రియను ఉపయోగించవచ్చు. ఒక సంస్థ ఆ బకాయిలను కొనుగోలు చేయడానికి యాంకర్ బిడ్ వేయవచ్చు. ఇతర సంస్థలు ఆ బిడ్ కంటే ఎక్కువ బిడ్ వేయవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్లు అంటే ఓ రకమైన పెట్టుబడిదారులు. వీరికి IPOలలో వాటాలను పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా పెద్ద సంస్థలు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటివి యాంకర్ ఇన్వెస్టర్లుగా ఉంటాయి
ఈరోజు జూలై 16, 2025 బుధవారం SBI షేర్లలో స్వల్ప పెరుగుదల కనిపించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లు ప్రారంభ ట్రేడింగ్ సమయంలో రూ. 820.60 వద్ద 0.51% పెరిగి రూ. 816.45 వద్ద ముగిశాయి. నేటి ట్రేడింగ్లో SBI షేర్లు రూ. 824 గరిష్ట స్థాయిని, 815.30 కనిష్ట స్థాయిని తాకాయి. ప్రస్తుతం క్ మార్కెట్ క్యాప్ రూ.7.33 లక్షల కోట్లుగా ఉండగా, పి/ఇ నిష్పత్తి 9.45గా ఉంది. డివిడెండ్ దిగుబడి 1.94%గా ఉంది. ఎస్బిఐ 52 వారాల గరిష్ట స్థాయి రూ.899 కాగా కనిష్ట స్థాయి రూ.680గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications