IT Stocks: కుప్పకూలిన ఐటీ స్టాక్స్.. భారీగా పడిపోయిన టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు..!
శుక్రవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఐటీ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ అయిన టీసీఎస్ షేర్ ధర NSEలో రూ.2,177.20 వద్ద 'డౌన్సైడ్ గ్యాప్'తో ప్రారంభమై, ఇంట్రాడేలో కనిష్టంగా ₹2,115.40 స్థాయిని తాకింది. ఈ స్టాక్ 3 శాతానికి పైగా నష్టాన్ని నమోదు చేసింది. అదేవిధంగా హెచ్ సీఎల్ టెక్ షేర్ ధర దాదాపు 2 శాతం, Tata Elxsi షేర్లు 2 శాతానికి పైగా, Route Mobile షేర్లు సుమారు 2.50 శాతం, టెక్ మహీంద్రా షేర్ ధర సుమారు 2% మేర నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత స్టాక్ మార్కెట్ సానుకూల ధోరణికి భిన్నంగా ఐటీ షేర్లు నష్టపోవడానికి బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల పెంపు ప్రధాన కారణం.
వడ్డీ రేట్ల పెంపుపై బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకున్న నిర్ణయం అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ (బాండ్ రాబడులు), అమెరికా డాలర్ (USD)పై ఒత్తిడిని పెంచుతుందని వారు పేర్కొన్నారు. భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా, ఇతర దేశాలకు ఐటీ సేవలను ఎగుమతి చేయడం వల్ల అమెరికా డాలర్లలో లావాదేవీలు జరుపుతాయని వారు వివరించారు. అమెరికా డాలర్ విలువ తగ్గడం వల్ల, ఐటీ కంపెనీలు ఆర్జించే డాలర్ల విలువ భారతీయ రూపాయి (INR)తో పోలిస్తే తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల పెంపును ప్రస్తావించారు. "బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఈ రోజు ఐటీ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. ఈ నిర్ణయం అమెరికా బాండ్ రాబడులు, డాలర్ విలువపై ప్రభావం చూపుతుంది. భారతీయ ఐటీ కంపెనీల ఆదాయం డాలర్లలో ఉండటం వల్ల, వారి ఆదాయం తగ్గే అవకాశం ఉంది. శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఐటీ షేర్లు వెనుకబడి ఉండటానికి ఇదే కారణం" అని నిపుణులు పేర్కొన్నారు.

భారతీయ ఐటీ షేర్లలోని ఈ తగ్గుదలను తక్కువ ధర వద్ద కొనుగోలు చేసే అవకాశంగా (బాటమ్ ఫిషింగ్) భావిస్తున్నట్లు చెప్పారు. AI (కృత్రిమ మేధస్సు) రంగంలో మందగమనం గురించిన చర్చలు ఉన్నప్పటికీ, భారతీయ ఐటీ, టెక్ రంగానికి భవిష్యత్తు సానుకూలంగానే ఉందని PACE 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ చెప్పారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం అమెరికా ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ విలువపై స్వల్పకాలిక ప్రభావాన్ని మాత్రమే చూపుతుందన్నారు. ఐటీ షేర్లలోని ఈ తగ్గుదల తాత్కాలికమే కావచ్చు. ఎందుకంటే, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని పెట్టుబడిదారులు వేచి చూస్తున్నారని తెలిపారు.
ద్రవ్యోల్బణం తన 2% లక్ష్యాన్ని మించిపోయే ప్రమాదాన్ని నివారించేందుకు, అందరూ ఊహించినట్లుగానే, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం నాడు వడ్డీ రేట్లను 31 ఏళ్ల గరిష్ట స్థాయి అయిన 1.25 శాతానికి పెంచింది. శుక్రవారం ముగిసిన రెండు రోజుల విధానపరమైన సమావేశంలో పాలక మండలి తన విధానపరమైన వడ్డీ రేటును 1 శాతం నుంచి పెంచాలని 7-2 ఓట్ల తేడాతో నిర్ణయించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
