మళ్లీ ఐపీఓలోకి వస్తున్న SBI.. రూ. 3.20 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించబోతున్న ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్

దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (SBIFML)లో 6.3 శాతం వాటాను ఐపీవో (ప్రారంభ పబ్లిక్ ఆఫర్) ద్వారా విక్రయించనున్నట్లు నవంబర్ 6న ప్రకటించింది. ఈ నిర్ణయం బ్యాంక్ యొక్క సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ECCB) సమావేశంలో ఆమోదించబడిందని సంస్థ తెలిపింది. మొత్తం 3.20 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది SBIFML మొత్తం ఈక్విటీ మూలధనంలో 6.3007 శాతం వాటాను సూచిస్తుంది. ఈ ఐపీవో అన్ని నియంత్రణ సంస్థల ఆమోదాలకు లోబడి ఉంటుంది.

నవంబర్ 6న మధ్యాహ్నం 1:20 గంటలకు ఎస్‌బీఐ షేర్లు స్వల్ప లాభాలతో రూ.957.7 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్థిక సంవత్సర 2024-25లో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ రూ.4,231 కోట్ల మొత్తం ఆదాయాన్ని సాధించగా.. ఇది SBI గ్రూప్ మొత్తం ఆదాయంలో 0.64 శాతం వాటా. అదనంగా, కంపెనీకి రూ.5,108.5 కోట్ల రిజర్వులు, మిగులు ఉన్నాయి. ఎస్‌బీఐ ఫైలింగ్ ప్రకారం, ఐపీవో ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం నవంబర్ 10, 2025న అమలు చేయబడుతుంది. మొత్తం ప్రక్రియ 2026లో పూర్తవుతుంది.

SBI Funds Management IPO SBI Mutual Fund IPO 2026 SBI to divest 6 3 stake SBI IPO listing SBI Mutual Fund valuation SBI Funds listing date SBI asset management IPO SBI IPO news SBI AMC IPO SBI stake sale Indian mutual fund IPO SBI Funds Management share sale SBI Mutual Fund public issue SBI investment news SBI group IPO plans 2026 6 3

ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ సంస్థ, ఎస్‌బీఐ, ఫ్రెంచ్ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థ అముండి మధ్య సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తుంది. ఈ సంస్థ రిటైల్, కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసం మ్యూచువల్ ఫండ్‌లు, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తుంది. ఎస్‌బీఐ ప్రస్తుతం 61.9 శాతం వాటాను కలిగి ఉంది. అముండి వద్ద 36.4 శాతం వాటా ఉంది. ఈ ఐపీవోలో అముండి ఇండియా హోల్డింగ్ కూడా 3.7 శాతం వాటాను విక్రయించనుంది. మొత్తంగా 5.08 కోట్ల షేర్లు (10.0013 శాతం వాటా) మార్కెట్లో లిస్టింగ్‌కి వస్తాయి.

1987లో ఎస్‌బీఐ స్పాన్సర్‌గా ప్రారంభమైన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ భారతదేశంలో మొట్టమొదటి యుటిఐేతర మ్యూచువల్ ఫండ్‌గా గుర్తింపు పొందింది. 1992లో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పూర్తిగా ఎస్‌బీఐ యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా ఏర్పడింది. ప్రస్తుతం SBIFML దేశంలోనే అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థగా నిలిచి ఉంది. 2025-26 రెండవ త్రైమాసికానికి త్రైమాసిక సగటు ఆస్తుల నిర్వహణ (QAAUM) రూ.11.99 లక్షల కోట్లు, ఆల్టర్నేట్స్ కింద రూ.16.32 లక్షల కోట్ల AUMను కలిగి ఉంది.

ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు సెట్టి మాట్లాడుతూ.. SBI కార్డ్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత మార్కెట్లో లిస్టింగ్‌కి వచ్చే తదుపరి సంస్థ SBIFML అవుతుంది. దీని బలమైన పనితీరు, మార్కెట్ నాయకత్వం దృష్ట్యా, ఐపీవో ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఇది ప్రస్తుత వాటాదారులకు విలువను పెంచడమే కాకుండా, సాధారణ పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలను అందిస్తుందని తెలిపారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ యొక్క చివరి IPO 2020లో జరిగింది.

అప్పుడు SBI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ విభాగం అయిన SBI కార్డ్స్ మార్చి 2020లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. దీనికి ముందు, SBI లైఫ్ ఇన్సూరెన్స్ 2017లో స్టాక్ మార్కెట్‌లోకి వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత, SBI తన ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీని IPO ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ IPO ద్వారా, SBI యాజమాన్యం తన వాటాలో కొంత మొత్తాన్ని విక్రయించాలని నిర్ణయించింది.

అముండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాలెరీ బౌడ్సన్ మాట్లాడుతూ.. భారత ఆస్తి నిర్వహణ రంగంలో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ అగ్రగామిగా నిలిచింది. ఎస్‌బీఐ యొక్క దేశవ్యాప్త పంపిణీ నెట్‌వర్క్ శక్తిని, అముండి యొక్క గ్లోబల్ అనుభవాన్ని కలిపి ఉపయోగించడం ద్వారా కంపెనీ విశేష విజయాన్ని సాధించింది. ఈ ఐపీవోతో భాగస్వామ్య విలువ మరింతగా అన్‌లాక్ అవుతుందని పేర్కొన్నారు.భారతదేశంలో IPO మార్కెట్ చరిత్రాత్మక ఉత్సాహంలో ఉన్న ఈ సమయంలో, ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీవో దేశీయ పెట్టుబడిదారులలో మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+