పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్‌లోకి..

భారతీయ కార్పొరేట్ చరిత్రలో అతి పెద్ద ఐపీఓ రానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన 'జియో ప్లాట్‌ఫామ్స్' సుమారు 4 బిలియన్ డాలర్ల విలువైన ఐపీఓ (IPO)కు సిద్ధమవుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవడమే కాకుండా.. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన నిష్క్రమణ మార్గాన్ని కూడా కల్పిస్తోంది. ముఖ్యంగా మెటా (Meta), గూగుల్ (Google) వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో సహా మొత్తం 14 మంది ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఈ ఆఫర్ ద్వారా తమ వాటాలను పాక్షికంగా విక్రయించనున్నారు.

2020లో Jio చేపట్టిన వేగవంతమైన నిధుల సమీకరణలో భాగంగా సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఆ పెట్టుబడిదారులు తమ వాటాల్లో దాదాపు 8 నుండి 8.5 శాతం వరకు తగ్గించుకోనున్నారు.ఈ ఐపీఓ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కొత్త మూలధనాన్ని సమీకరించడం కంటే, ప్రస్తుత వాటాదారులు తమ షేర్లను విక్రయించే 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) రూపంలో ఉండబోతోంది. నివేదికల ప్రకారం.. సుమారు 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి రానున్నాయి.

Jio IPO 2026 Jio Platforms IPO Jio DRHP filing Jio IPO stake sale Jio investor exit 252 million shares Jio Jio IPO OFS Reliance Jio IPO news Jio IPO early investors India mega IPO IPO 2026 IPO DRHP IPO 252 IPO OFS IPO IPO IPO

ఆర్‌ఐఎల్ టెలికాం యూనిట్ జియో ప్లాట్‌ఫామ్స్.. ఇప్పుడు సెబీకి తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయ మూలాల ప్రకారం.. ఈ దాఖలు కొద్ది రోజుల్లోనే జరగవచ్చని సూచన ఉంది. అదనంగా, కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 (FY27)లో జియో IPO ప్రక్రియను ప్రారంభించవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) సుమారు $125 బిలియన్ మార్కెట్ విలువను పరిశీలిస్తోంది. ఈ విలువను దృష్టిలో ఉంచుకుంటే, జియో IPO $3 బిలియన్‌ను దాటే అవకాశం ఉంది, దీని ఫలితంగా ఇది భారతదేశ చరిత్రలో అతిపెద్ద IPOగా నిలుస్తుంది. గమనించదగ్గ విషయంగా.. మే 2022లో LIC IPO $2.5 బిలియన్‌ కాగా అక్టోబర్ 2024లో Hyundai IPO $2.97 బిలియన్‌కి చేరింది.

ఈ ఐపీఓ తర్వాత బయటి పెట్టుబడిదారుల ఉమ్మడి వాటా ప్రస్తుతం ఉన్న 32.9 శాతం నుండి సుమారు 30 శాతానికి తగ్గుతుంది. అయితే, ప్రధాన ప్రమోటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వద్ద ఉన్న 67 శాతం యాజమాన్యాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించుకుంది. మెటా తన వాటాను 9.98 శాతం నుండి 9.1 శాతానికి, గూగుల్ 7.73 శాతం నుండి 7 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉంది.

జియో ప్లాట్‌ఫామ్స్ విలువను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు 133 నుండి 180 బిలియన్ డాలర్ల మధ్య అంచనా వేస్తున్నాయి. ఈ మెగా ఐపీఓ వెనుక ఆకాష్ అంబానీ నాయకత్వంలోని బృందం, 17 మంది ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల సమూహం పనిచేస్తోంది. 2016లో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన జియో, అతి తక్కువ కాలంలోనే 491 మిలియన్లకు పైగా చందాదారులతో భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఎదిగింది.

2019లోనే ముఖేష్ అంబానీ తన టెలికాం, రిటైల్ విభాగాలను ఐదేళ్లలోపు లిస్ట్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఐపీఓ నిబంధనలను సడలించడం జియోకు కలిసి వచ్చింది. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న కంపెనీలు ఇప్పుడు కనీసం 2.5 శాతం ఈక్విటీని విక్రయించే అవకాశం ఉండటంతో, జియో ఐపీఓ ప్రక్రియ మరింత సులభతరమైంది.

వారసత్వ ప్రణాళికలో భాగంగా ఆకాష్ అంబానీ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుగా దీనిని పరిగణించవచ్చు. ఇప్పటికే సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసే పనులు తుది దశకు చేరుకున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ఆరంభంలోనే ఈ ఐపీఓ ప్రక్రియ ఊపందుకోనుంది. ప్రస్తుతం జియో సగటు వినియోగదారు ఆదాయం (ARPU) నెలకు రూ. 213.7గా ఉండగా.. ప్రత్యర్థి సంస్థలతో పోటీపడుతూనే డిజిటల్ సేవల విస్తరణలో జియో దూసుకుపోతోంది. ఈ లిస్టింగ్ ద్వారా జియో గ్లోబల్ టెక్ పవర్ హౌస్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడమే కాకుండా, భారతీయ స్టాక్ మార్కెట్ పరిమాణాన్ని కూడా పెంచనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+