Reliance Jio IPO: దేశంలోనే అతిపెద్ద తొలి పబ్లిక్ ఆఫర్ (IPO)రాబోతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాదిలోనే మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే జియో ఐపీఓ ద్వారా భారీ మొత్తంలో నిధులు సమీకరించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే, భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా జియో రికార్డు సృష్టించనుంది.
గత నవంబరులో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ రిలయన్స్ జియో విలువను సుమారు 180 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16.20 లక్షల కోట్లు)గా అంచనా వేసింది. ఈ విలువ ఆధారంగా చూస్తే, జియోలో కేవలం 2.5 శాతం వాటా విక్రయించినా కూడా సంస్థకు 4 నుంచి 4.5 బిలియన్ డాలర్లు (రూ.36 వేల నుంచి రూ. 40,500 కోట్లు) సమీకరించే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో నిధులు సమీకరిస్తే, ఇప్పటివరకు దేశంలో జరిగిన అన్ని ఐపీఓలను జియో అధిగమించినట్లే అవుతుంది.

ప్రస్తుతం రిలయన్స్ జియోకు 50 కోట్లకు పైగా చందాదారులు ఉండగా.. ఇది దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా కొనసాగుతోంది. మొబైల్ సేవలతో పాటు డేటా, డిజిటల్ ప్లాట్ఫామ్లు, ఎంటర్టైన్మెంట్ మరియు క్లౌడ్ సేవల రంగాల్లో జియో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించింది. ఈ నేపథ్యంలో జియో ఐపీఓ కోసం దేశీయ, అంతర్జాతీయ మదుపర్లు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత ఆరు సంవత్సరాలుగా జియో తన వ్యాపారాన్ని కేవలం టెలికాం వరకు పరిమితం చేయకుండా కృత్రిమ మేధ (AI), డిజిటల్ ఎకోసిస్టమ్లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్ టెక్నాలజీ రంగాల్లోకి విస్తరించింది. ఈ ప్రయాణంలో KKR, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వంటి ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి భారీగా నిధులు సమీకరించింది.
జియో ఐపీఓ ముసాయిదాను సిద్ధం చేసే పనిలో మోర్గాన్ స్టాన్లీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు పాల్గొంటున్నట్లు సమాచారం. గత ఏడాది ఆగస్టులో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ముకేశ్ అంబానీ.. 2026 ప్రథమార్థంలో జియో ఐపీఓ వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. అయితే, మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల నిర్ణయాల ఆధారంగానే తుది తేదీ నిర్ణయించనున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం సెబీ నిబంధనల ప్రకారం.. పెద్ద కంపెనీలు ఐపీఓ ద్వారా నిధులు సమీకరించాలంటే కనీసం 5 శాతం వాటా విక్రయించాలి. అయితే ఈ నిబంధనను 2.5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. జియో పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని, కేవలం 2.5 శాతం వాటానే విక్రయించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. అయితే జియో ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలోనే వస్తుందా లేదా కొత్త షేర్ల జారీ కూడా ఉంటుందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇటీవల హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.27,870 కోట్ల ఐపీఓ పూర్తిగా ఓఎఫ్ఎస్గా రావడం గమనార్హం. జియో విషయంలో కూడా ఇలాంటి మోడల్ను అనుసరిస్తారా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. రూ.11 లక్షల కోట్లు ఆవిరి.. సెన్సెక్స్ 1,800 పాయింట్లు డౌన్

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

వార్ దెబ్బకు కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు..

Iran Israel war: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం! భారత ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్లకు ముప్పు తప్పదా?

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..



Click it and Unblock the Notifications