PC Jeweller: మూడు రోజుల్లో 34 శాతం పెరిగిన స్టాక్.. ఇంకా పెరుగుతుందా..!
ఢిల్లీకి చెందిన ఆభరణాల విక్రయ సంస్థ పీసీ జ్యువెలర్ (PC Jeweller) షేర్లు సోమవారం భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 7న వరుసగా మూడవ సెషన్లోనూ లాభపడ్డాయి. గత మూడు సెషన్లలో ఈ స్టాక్ భారీగా 34 శాతం పెరిగింది. బీఎస్ఈలో రూ.13.66 గరిష్ట స్థాయిని తాకింది. అప్పుల రహిత సంస్థగా మారే దిశగా మరో ముందడుగు వేసినట్లు కంపెనీ గత గురువారం ప్రకటించడంతో ఈ స్టాక్పై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఇంట్రాడే ట్రేడింగ్లో పీసీ జ్యువెలర్ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, BSEలలో దాదాపు 15 శాతం వరకు పెరిగాయి. మరొక బ్యాంకుతో కుదుర్చుకున్న సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం, తన బకాయి ఉన్న అప్పులన్నింటినీ పూర్తిగా చెల్లించి తీర్చినట్లు PC జ్యువెలర్ గత వారం తెలిపింది.
ఈ విజయవంతమైన రుణ పరిష్కారంతో కన్సార్టియంలోని మొత్తం 14 బ్యాంకులలో 9 బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ కంపెనీ ఇప్పుడు చెల్లించినట్లు ఎక్సేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. ఈ చెల్లింపులన్నీ నిర్ణీత గడువు తేదీల కంటే ముందే పూర్తి అయినట్లు PC జ్యువెలర్ నియంత్రణ సంస్థకు సమర్పించిన నివేదికలో వివరించింది. మిగిలిన ఐదు బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలలో కూడా 96 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్లు PC జ్యువెలర్ ప్రకటించింది. మిగిలిన ఐదు బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలలో ఇంకా మిగిలి ఉన్న 4 శాతం కంటే తక్కువ మొత్తాన్ని కూడా చెల్లించి ఈ నెలలోనే అప్పుల రహిత సంస్థగా మారే దిశగా కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది.

అప్పులు తిరిగి తీర్చడం కంపెనీ బ్యాలెన్స్ షీట్, ఆర్థిక స్థితిని గణనీయంగా బలోపేతం చేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. PC జ్యువెలర్ తన రుణ భారాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఈ త్రైమాసికం ముగిసే సమయానికి అప్పుల రహిత సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. రుణ తగ్గింపు ప్రణాళికలో భాగంగా, కన్సార్టియంలోని 14 బ్యాంకులలో 8 బ్యాంకులకు సంబంధించిన బకాయిలను నిర్ణీత గడువు తేదీల కంటే ముందే చెల్లించినట్లు PC జ్యువెలర్ గత నెలలో ప్రకటించింది. మెరుగైన ఆదాయం కారణంగా జూన్తో ముగిసిన త్రైమాసికంలో PC జ్యువెలర్ తన ఏకీకృత నికర లాభంలో 37 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.222 కోట్లకు చేరుకుంది.
అలాగే ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ అప్పుల రహితంగా మారుతుందని తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.161.93 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.807.88 కోట్ల ఆదాయంతో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.879.27 కోట్లకు పెరిగింది. ఈ ఆభరణాల విక్రయ సంస్థ నిర్వహణ లాభం (EBITDA) సమీక్షా త్రైమాసికంలో 90 శాతం పెరిగి రూ.242 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే త్రైమాసికంలో ఇది రూ.127 కోట్లుగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
