స్టాక్ మార్కెట్లో పాత రికార్డులు బద్దలు కొట్టబోతున్న NSE IPO.. ఎంట్రీ డేట్,GMP,ధర,ఇష్యూ సైజ్ పూర్తి వివరాలివే

NSE IPO: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) తన చిరకాల కల అయిన పబ్లిక్ లిస్టింగ్ దిశగా అత్యంత కీలకమైన అడుగు వేస్తూ, మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' కి ఎట్టకేలకు తన ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. అక్టోబర్ 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,859 కోట్లతో సృష్టించిన రికార్డును బద్దలు కొడుతూ, సుమారు రూ. 30 వేల కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో రాబోయే ఈ ఐపీఓ భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది.

ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) పద్ధతిలో జరగనుండగా, దీని ద్వారా ఎన్‌ఎస్‌ఈ ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు. కేవలం ప్రస్తుత వాటాదారులు తమ వద్ద ఉన్న 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తూ ఎక్స్ఛేంజ్ మొత్తం వాటాలో దాదాపు 6 శాతాన్ని వదులుకుంటున్నారు. ఫిబ్రవరి 6న ఎన్‌ఎస్‌ఈ బోర్డు దీనికి ఆమోదం తెలపడంతో ఈ ముసాయిదా పత్రాల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుత సెబీ సమీక్షా ప్రక్రియ, నియంత్రణ సంస్థల తుది అనుమతికి పట్టే కాలాన్ని బట్టి చూస్తే, 2026 చివరి నాటికి ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఇష్యూను నిర్వహించడానికి ఎన్‌ఎస్‌ఈ ఏకంగా 20 మంది మర్చంట్ బ్యాంకర్లను నియమించుకుంది.

NSE IPO NSE IPO date NSE IPO GMP NSE IPO price band NSE listing National Stock Exchange IPO IPO news stock market IPO NSE valuation IPO investment grey market premium NSE shares Indian stock market upcoming IPOs NSE IPO NSE IPO NSE IPO GMP NSE IPO NSE IPO IPO IPO NSE NSE IPO

మార్కెట్ నివేదికల ప్రకారం. NSE IPO లో ఒక్కో షేరు ధర సుమారు రూ. 2,000 ఉండవచ్చని అంచనా వేస్తుండగా, ఈ ధర ఆధారంగా ఎన్‌ఎస్‌ఈ యొక్క మొత్తం మార్కెట్ విలువ రూ. 5 లక్షల కోట్లకు పైగా ఉండనుంది. కంపెనీ అధికారిక ధరల శ్రేణి, లాట్ సైజ్, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) వివరాలను ఐపీఓ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ప్రకటిస్తారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 1.8 లక్షల మంది వాటాదారులు ఉండగా, ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read

ఈ ఐపీఓ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా లాభపడనుంది. గతంలో కేవలం రూ. 1.98 కోట్ల వెయిటెడ్ యావరేజ్ కాస్ట్‌తో కొనుగోలు చేసిన తన షేర్లను, ప్రస్తుతం సుమారు రూ. 4,950 కోట్ల విలువకు ఎస్‌బీఐ విక్రయించనుంది. అలాగే కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, అరండా ఇన్వెస్ట్‌మెంట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు జీఐసీ వంటి ప్రముఖ సంస్థలు తమ వాటాలను విక్రయిస్తుండగా, ఎన్‌ఎస్‌ఈలో అత్యంత భారీగా 10.72 శాతం వాటాను కలిగి ఉండి, ఏకైక అతిపెద్ద వాటాదారుగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మాత్రం ఈ ఐపీఓలో తన ఒక్క షేరును కూడా విక్రయించడం లేదు.

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 2016లోనే రూ. 10 వేల కోట్ల సేకరణ కోసం తొలిసారి ముసాయిదా పత్రాలు దాఖలు చేసినప్పటికీ, అప్పట్లో సంచలనం సృష్టించిన 'కో-లొకేషన్ కేసు', పాలనా లోపాల కారణంగా సెబీ దీనిని నిలిపివేసింది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఎన్‌ఎస్‌ఈ అనేక నియమపాలన చర్యలను చేపట్టింది. 2025 జూన్‌లో దాఖలు చేసిన సెటిల్‌మెంట్ దరఖాస్తులో భాగంగా రూ. 1,388 కోట్లు చెల్లించడానికి ఎక్స్ఛేంజ్ ముందుకు రావడం, మరియు జనవరిలో అన్యాయమైన మార్కెట్ యాక్సెస్ కేసు పరిష్కారానికి సెబీ సూత్రప్రాయ ఆమోదం తెలపడంతో ఐపీఓకు ఉన్న అతిపెద్ద చట్టపరమైన అడ్డంకి తొలగిపోయింది.

ఆర్థిక పరంగా చూస్తే, ఆర్థిక సంవత్సరం 2026కు గాను ఎన్‌ఎస్‌ఈ మొత్తం ఆదాయం రూ. 18,713 కోట్లుగా నమోదైంది. ట్రేడింగ్ ఛార్జీల తగ్గింపు మరియు డెరివేటివ్స్ (F&O) పై సెబీ నియంత్రణలు కఠినతరం చేయడం వల్ల పన్ను తర్వాత లాభం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15 శాతం తగ్గి రూ. 10,302 కోట్లకు పరిమితమైంది. అయితే, స్వల్పకాలికంగా వార్షిక లాభాలు తగ్గినప్పటికీ, మార్చి 2026 త్రైమాసికం (Q4FY26) ఫలితాలు మాత్రం అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,650 కోట్లుగా ఉన్న నికర లాభం ఈసారి 8 శాతం పెరిగి రూ. 2,871 కోట్లకు చేరింది. అలాగే త్రైమాసిక ఆదాయం కూడా 22 శాతం వృద్ధితో రూ. 5,360 కోట్లను తాకింది. ఈ త్రైమాసిక పురోగతి రాబోయే ఐపీఓపై పెట్టుబడిదారులలో మరింత ఆశావహ దృక్పథాన్ని నింపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+