NSE IPO: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. దేశంలోనే బిగ్గెస్ట్ IPO కి లైన్ క్లియర్! కానీ, ఒక్క ట్విస్ట్ ఉంది!

భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు దాదాపు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్‌ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పబ్లిక్ ఆఫరింగ్ (NSE IPO) కి ఎట్టకేలకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NoC) లభించింది. 2016లో మొదటిసారి ఐపీఓ కోసం ప్రయత్నించిన ఎన్‌ఎస్‌ఈ.. అనేక న్యాయపరమైన చిక్కులు దాటుకుని ఇప్పుడు పబ్లిక్ లిస్టింగ్‌కు సిద్ధమైంది.

NSE IPO gets SEBI approval after 9 years everything about 5 lakh crore valuation and listing timeline in India

ఏమిటీ ఆఫర్-ఫర్-సేల్ (OFS)?

ఈ NSE IPO ద్వారా ఎన్‌ఎస్‌ఈ సంస్థ కొత్తగా నిధులేమీ సేకరించడం లేదు. ఇది పూర్తిగా 'ఆఫర్-ఫర్-సేల్' (OFS) పద్ధతిలో జరగనుంది. అంటే ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వాటాలు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు (షేర్ హోల్డర్లు) తమ దగ్గర ఉన్న వాటాలను సామాన్య ప్రజలకు విక్రయిస్తారు. సెబీ నుండి అనుమతి రావడంతో, త్వరలోనే ఎన్‌ఎస్‌ఈ మర్చంట్ బ్యాంకర్లను , లీగల్ అడ్వైజర్లను నియమించుకుని డ్రాఫ్ట్ పేపర్లను (DRHP) సమర్పించనుంది.

రూ. 5 లక్షల కోట్ల భారీ వ్యాల్యూయేషన్!

అన్‌లిస్టెడ్ మార్కెట్ (గ్రే మార్కెట్) అంచనాల ప్రకారం, ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ. 5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఐపీఓలలో ఒకటిగా నిలుస్తుంది. ఐపీఓ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 8 నుండి 9 నెలల సమయం పట్టవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇన్నాళ్లు ఎందుకు ఆగింది?

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ నిలిచిపోవడానికి ప్రధాన కారణం 'డార్క్ ఫైబర్' కేసు. 2010-2014 మధ్య కాలంలో కొందరు హై-ఫ్రీక్వెన్సీ ట్రేడర్లకు ఎన్‌ఎస్‌ఈ ప్రాధాన్యతనిచ్చిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సెబీ విచారణ జరిపి జరిమానాలు కూడా విధించింది. ఈ న్యాయపరమైన వివాదాల వల్లే ఐపీఓ ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు క్లియరెన్స్ రావడంతో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది.

NSE చైర్మన్ శ్రీనివాస్ ఇంజేటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఇది NSE ప్రయాణంలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో NSE పోషిస్తున్న పాత్రకు ఈ అనుమతి ఒక గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ ఐపీఓ (NSE IPO) ఒక గొప్ప అవకాశంగా మారబోతోంది.

ఇన్వెస్టర్లకు సూచనలు

NSE IPO కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ ఐపీఓ మార్కెట్లోకి రావడానికి మరో 8 నుండి 9 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు మార్కెట్ కదలికలను గమనిస్తూ ఉండటం ముఖ్యం. ఎన్‌ఎస్‌ఈ అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే సంస్థ. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది మంచి ఆప్షన్‌గా మారవచ్చు. అయితే ఇది పూర్తిగా 'ఆఫర్-ఫర్-సేల్' (OFS) ద్వారా వస్తున్నందున.. కంపెనీకి కొత్తగా నిధులు రావు అనే విషయాన్ని గమనించాలి. పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ సెబీకి సమర్పించే DRHP పత్రాలను క్షుణ్ణంగా చదివి, మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+