Budget 2025: మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ క్రమంలో ప్రజలు కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్ల గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో శనివారం కూడా ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నట్లు కీలక ప్రకటన రావటంతో అందరి చూపు ఈ విషయంపైనే కొనసాగుతోంది. అసలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
వాస్తవానకి ప్రతి ఏటా ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో కేంద్రం తన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే రోజు. అయితే ఈ సారి ఫిబ్రవరి 1 శనివారం రావటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి కుదరటం లేదు. బడ్జెట్ ప్రకటనల ప్రకారం పెట్టుబడులు తీసుకునే నిర్ణయాలు ఎకానమీ పరిస్థితులను ప్రతిబంబిస్తాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ చేసుకోవటానికి స్టాక్ మార్కెట్లను ప్రత్యేకంగా పనిచేసే విధంగా కీలక నిర్ణయం రావటంతో అందరిలోనూ కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసే ప్రతి ప్రకటన ఆయా రంగాల్లోని కంపెనీల షేర్లపై ప్రభావాన్ని చూపటం ఏటా మనం చూస్తూనే ఉన్నాం.

అందుకే ఈ సారి బడ్జెట్ ప్రసంగం రోజున నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బడ్జెట్ సమర్పించబే ఫిబ్రవరి 1, 2025న స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్కు తెరవబడతాయని ప్రకటించబడింది. గతంలో 2015, 2020 సమయాల్లో సైతం ఇలాంటి ప్రత్యేక ఏర్పాటు చేయబడిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం కారణంగా ఫిబ్రవరి 1 పూర్తి ట్రేడింగ్ డేగా కొనసాగుతుందని బీఎస్ఈ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. అంటే ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30 వరకు ట్రేడింగ్ విండో తెరవబడుతుంది. అయితే ఆ రోజు "T0" ప్రాతిపదికన ఎటువంటి ట్రేడింగ్ జరగదని కూడా స్పష్టం చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఫిబ్రవరి 1, 2025న వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ క్రమంలో దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు, విధానాలు, కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు ఇందులో ఉంటాయి. ఒక పక్క ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తూ ఉండగానే మరోపక్క దేశీయ స్టాక్ మార్కెట్లు దానికి అనుగుణంగా ప్రభావితం అవుతుంటాయి. ఇన్వెస్టర్లు ఏఏ రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించబడ్డాయో వాటిపై బెట్టింగ్ వేసేందుకు ఇష్టపడుతుంటారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications