Nectar Lifesciences Shares Crashes: సాధారణంగా ప్రముఖ కంపెనీలు తమ ముఖ్యమైన వ్యాపారంపై దృష్టి సారించేందుకు ఇతర వ్యాపారాల నుండి నిష్క్రమిస్తూ ఉంటాయి. అయితే ఫార్మా రంగానికి చెందిన నెక్టార్ లైఫ్ సైన్సెస్ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరించి మార్కెట్లో సంచలనం రేపింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించిన ప్రకారం అ కంపెనీ తన ప్రధాన వ్యాపారాన్ని రూ. 1,270 కోట్లకు Ceph Lifesciences Private Limited కు విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ ఒక్క ప్రకటనతో పెట్టుబడిదారుల్లో భయాందోళన నెలకొంది. ఈ వార్త వెలువడిన వెంటనే కంపెనీ వాటాదారులలో తీవ్ర భయాందోళన నెలకొనడంతో కంపెనీ షేర్లు భారీగా కుప్పకూలాయి.
స్టాక్ మార్కెట్లో అమ్మకాలు తీవ్రతరం కావడంతో ఒక్క కొనుగోలుదారుడు కూడా లేకుండా షేర్లు అత్యల్ప స్థాయి ధరకు చేరుకున్నాయి.ఈ కంపెనీ షేరు ధర దాదాపు 20 శాతం పడిపోయి రూ. 18.53 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. అమ్మకం ప్రకటనతో గత సంవత్సరం సెప్టెంబర్ 11న రూ. 56.39 వద్ద ఉన్న షేర్లు ఇప్పటి వరకు సుమారు 67 శాతం విలువను కోల్పోయాయి. మే నెలలో 23% లాభపడిన ఈ షేరు తరువాతి నెలల్లో వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. గత నెల జూన్లో 18%, ప్రస్తుత జూలైలో ఇప్పటికే 14% పతనమైంది.

నెక్టార్ లైఫ్ సైన్సెస్ ఎందుకు వ్యాపారం అమ్ముతోంది? నెక్టార్ లైఫ్ సైన్సెస్ తన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (API) ఫార్ములేషన్ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడానికి డెఫినిటివ్ బిజినెస్ ట్రాన్స్ఫర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తన మెన్తాల్ వ్యాపారాన్నికూడా రూ. 20 కోట్లకు విక్రయించనుంది. మొత్తం లావాదేవీ విలువ రూ. 1,290 కోట్లుగా ఉంది. ఈ కీలక నిర్ణయం ద్వారా నెక్టార్ కంపెనీ తన వ్యాపారాన్ని సరళీకృతం చేసి...ఉన్న అప్పులను తీరుస్తూ, కొత్త వ్యాపార అవకాశాల్లో పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, వాటాదారులకు డివిడెండ్లు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది.
సంస్థ అధినేత శ్రీ సంజీవ్ గోయల్ మాట్లాడుతూ..ఈ ఒప్పందం నెక్టార్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. వృద్ధి చెందిన, పెట్టుబడులు ఎక్కువగా అవసరమైన విభాగాలను విడిచిపెట్టి, సంస్థను సరికొత్త మార్గంలో మరింత దగ్గరగా తీసుకెళ్లే దిశగా మేము అడుగులు వేస్తున్నామని తెలిపారు. కాగా కంపెనీ సెప్టెంబర్ 20, 2025 లోపు షేర్ హోల్డర్ల అనుమతితో ఈ విక్రయం పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఒప్పందాన్ని జూలై 7, 2025 న కంపెనీ బోర్డు ఆమోదించింది. ఆగస్టు 4, 2025 న షేర్ హోల్డర్ల నుంచి అనుమతి పొందేందుకు ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్ (EGM) నిర్వహించనుంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications