స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని చాల మంది భావిస్తారు, అయితే అందులో లాభాలను ఇచ్చే షేర్లు చాలానే ఉన్నాయి, ఇవి పెట్టుబడిదారులను ధనవంతులుగా మార్చగలవని నిరూపించాయి కూడా. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ల లిస్ట్ చాలా పెద్దది ఇంకా ఇందులో మద్యం తయారీ కంపెనీ పికాడిల్లీ ఆగ్రో షేర్లు కూడా ఉన్నాయి. ఐదేళ్ల క్రితం ఈ షేర్లో కేవలం రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికీ ఇప్పుడు మొత్తం దాని విలువ రూ.91 లక్షలకు పైగా పెరిగింది.
పిక్కడిల్లీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ (PAIL) ,
దీనిని 1994 సంవత్సరంలో ప్రారంభించారు, ఇది ఒక భారతీయ కంపెనీ. ఈ కంపెనీ మద్యాన్ని ఉత్పత్తి చేస్తుంది అలాగే ఈ సింగిల్ మాల్ట్ విస్కీ ఇంద్రి చాల టైటిళ్లను కూడా గెలుచుకుంది. మరోవైపు ఈ కంపెనీ షేర్లు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తూ ఇన్వెస్టర్లను ధనవంతులను చేస్తున్నాయి. ఐదేళ్ల క్రితం 24 జనవరి 2020న కంపెనీ ఒక షేరు ధర రూ. 8.58 మాత్రమే, కానీ ఇప్పుడు షేర్ ధర రూ.780 వరకు పెరిగింది అంటే దీని లాభాలను మీరు అంచనా వేయవచ్చు. నిన్నటి ట్రేడింగ్ రోజున పతనమైన ఈ షేరు రూ.788.60 వద్ద ముగిసింది.

ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన ఇన్వెస్టర్లు అందుకున్న మల్టీబ్యాగర్ రిటర్న్ గురించి మాట్లాడుకుందాం... ఒక పెట్టుబడిదారుడు 24 జనవరి 2020న కంపెనీ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి, ఇప్పటి వరకు వాటిని ఉంచుకున్నట్లయితే అతని మొత్తం రూ. 91 లక్షల 91 వేలకు పెరిగి ఉండేది.
2023 తర్వాత స్టాక్లో మెరుపు పెరుగుదల
ఐదేళ్ల కాలంలో ఈ స్టాక్ కదలికను పరిశీలిస్తే రూ. 8 నుండి పెరిగిన తర్వాత మూడేళ్లలో చాలా నెమ్మదిగా కదిలింది. జనవరి 2023లో దాని ధర దాదాపుగా రూ. 40కి చేరుకుంది. అయితే దీని తర్వాత ఈ ఏడాది ఆగస్టు 25న రూ.100 మార్క్ను దాటిన తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 25 జనవరి 2024న, దీని ధర రూ. 292.20 అయింది ఇంకా డిసెంబర్ 2024లో షేర్ ధర రూ. 1019.90 గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు షేర్ వాల్యూ 15 శాతం క్షీణించింది.
నిజానికి రెండుసార్లు ఉత్తమ విస్కీ అవార్డు
ఇంద్రి సింగిల్ మాల్ట్ ఇండియన్ విస్కీ రెండుసార్లు ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ బిరుదును అందుకుంది, మొదటగా 2023 సంవత్సరంలో తరువాత గత సంవత్సరం 2024లో గెల్చుకుంది. ఈ అవార్డుల ప్రభావం కంపెనీ షేర్లపై కూడా పడింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications