2025 బీహార్ ఎన్నికల్లో NDA ముందంజలో ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్ల బలహీనత, అలాగే US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు ఆశలు క్షీణించడం వల్ల శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పెట్టుబడిదారుల భావన దెబ్బతినడంతో, బెంచ్మార్క్ సూచీలు రెండూ పతన దిశలో కదిలాయి. సెన్సెక్స్ 0.51 శాతం క్షీణించి 84,042.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకగా, నిఫ్టీ 50 కూడా 0.44 శాతం నష్టపోయి 25,764.90 వద్ద ముగిసింది.
సెన్సెక్స్లో ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు పెద్ద నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు అదానీ పోర్ట్స్, ఆసియన్ పెయింట్స్, ట్రెంట్ లాభాల్లో నిలిచాయి. నిఫ్టీ 50లో కూడా ఇదే ధోరణి కొనసాగింది. ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్ నష్టాల్లో ఉండగా, అదానీ ఎంటర్ప్రైజెస్, జియో ఫైనాన్షియల్, ఆసియన్ పెయింట్స్ లాభపడ్డాయి. విస్తృత మార్కెట్లలో అయితే మిశ్రమ సూచనలే కనిపించాయి.

ఎన్రిచ్ మనీ CEO పొన్ముడి ఆర్ ప్రకారం.. US ఫెడ్ అధికారుల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచి, మార్కెట్లను జాగ్రత్తగా వ్యవహరించేలా చేశాయి. రేటు కోతల వేగం తగ్గవచ్చన్న అంచనాలు అంతర్జాతీయ ఈక్విటీలను బలహీనపరిచాయి, దీని ప్రతికూల ప్రభావం భారత మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపించింది. ఉదయం 10:50 గంటలకు కూడా పరిస్థితి మారలేదు. సెన్సెక్స్ 0.36 శాతం తగ్గి 84,175.97 వద్దకు, నిఫ్టీ 50 0.34 శాతం తగ్గి 25,792.05 వద్దకు చేరాయి.
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ అభిప్రాయం ప్రకారం.. ఎన్నికల ఫలితాల ప్రభావం తాత్కాలికమే. మధ్యకాల, దీర్ఘకాల మార్కెట్ దిశ భారత ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్పైనే ఆధారపడుతుంది. బలమైన జిడిపి వృద్ధి, కంపెనీల ఆదాయాల పెరుగుదల వంటి అంశాల వల్ల పెట్టుబడిదారులకు ఆశావాదం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇక మార్కెట్ బలహీనతకు ప్రధాన కారణాల్లో ఒకటి లిక్విడిటీ ఒత్తిడి. ఈక్వినోమిక్స్ రీసెర్చ్కు చెందిన జి. చోకలింగం ప్రకారం.. స్మాల్, మిడ్-క్యాప్ స్టాక్స్లో నాలుగో వంతు ఇప్పటికే 20-40 శాతం పడిపోయాయి. భారీ IPOలు రూ. 1.5 ట్రిలియన్లకు పైగా లిక్విడిటీని పీల్చేయగా, ప్రమోటర్లు కొన్నిటిలో వాటాలను అమ్మడం, విదేశీ పెట్టుబడిదారుల (FPI) ఉపసంహరణ మార్కెట్ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. ఇంకా రాబోయే రెండు నెలల్లో పెద్ద మొత్తంలో IPO లాక్-ఇన్ ముగియడం లిక్విడిటీ భయాలను పెంచుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లూ భారత మార్కెటుపై ఒత్తిడిని పెంచాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు వాల్ స్ట్రీట్ భారీ అమ్మకాల ప్రభావంతో క్షీణించాయి. జపాన్ నిక్కీ, కొరియా కోస్పి, హాంగ్ సెంగ్, CSI 300, ఆస్ట్రేలియా ASX అన్నీ పెద్దగా పతనమయ్యాయి. USలో కూడా పెట్టుబడిదారులు అధిక విలువ కలిగిన టెక్, AI స్టాక్స్ నుంచి బయటకు రావడంతో డౌ, S&P 500, నాస్డాక్ తీవ్రంగా పడిపోయాయి.
అదే సమయంలో, US ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ రేటు కోతపై స్పష్టత ఇవ్వకపోవడంతో సంకేతాలు మరింత బలహీనపడాయి. బోస్టన్ ఫెడ్ ప్రెసిడెంట్ సుసాన్ కాలిన్స్ రేట్లను కొంతకాలం స్థిరంగా ఉంచడం అవసరం కావచ్చని చెప్పడం పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచింది. ఈ వారం విదేశీ పెట్టుబడిదారులు రూ. 7,051 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, DIIలు భారీగా కొనుగోళ్లు చేసి కొంత స్థిరత్వాన్ని తీసుకొచ్చారు. అయితే సాంకేతికంగా నిఫ్టీ 25,980 పైన నిలబడలేకపోవడం, ఆసిలేటర్ల నుండి రివర్సల్ సంకేతాలు రాకపోవడం Markets లో మరింత జాగ్రత్తను సూచిస్తున్నాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications