దేశంలోని అత్యంత విలాసవంతమైన హోటల్ బ్రాండ్లలో ఒకటైన లీలా ప్యాలెస్లు, హోటల్స్, రిసార్ట్స్, దాదాపు 40 సంవత్సరాల తర్వాత, సోమవారం, మే 26న స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి.ది లీలా హోటల్ను కలిగి ఉన్న బ్రూక్ఫీల్డ్ స్క్లాస్ బెంగళూరు తన IPOను ప్రారంభించింది, ఇది మే 28 వరకు సబ్స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది.బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ స్క్లాస్ ఇప్పుడు ది లీలా హోటల్ను కలిగి ఉంది.
మార్కెట్ నుండి రూ.3,500 కోట్లను సేకరించడానికి ఈ IPOను ప్రారంభించింది. షేరు ధర యూనిట్కు రూ.413 నుండి రూ.435 మధ్య నిర్ణయించారు. పెట్టుబడిదారులు కనీసం 34 షేర్లను కొనుగోలు చేయాలి, అంటే కనీసం రూ.14,790 పెట్టుబడి. ఒక పెట్టుబడిదారుడు గరిష్టంగా 13 లాట్లను కొనుగోలు చేయవచ్చు, అంటే ఇది రూ.1,92,270 విలువైన 442 షేర్లకు సమానం.

లీలా ప్యాలెస్, హోటల్, రిసార్ట్లను ఎవరు ప్రారంభించారు? : ఈ హోటల్ చైన్ను 1986లో రిటైర్డ్ సైనికుడు కెప్టెన్ సిపి కృష్ణన్ నాయర్ స్థాపించారు. అతను 1950లో వివాహం చేసుకున్న తరువాత తన భార్య లీల పేరును ఈ చెయిన్కు పెట్టాడు. మొదటి రిసార్ట్ ముంబైలో ది లీలా ముంబై పేరుతో ప్రారంభించారు.
విజయవంతమైన వ్యాపారవేత్త అయిన కెప్టెన్ నాయర్, ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన సౌకర్యాలు, ప్రధాన ప్రదేశాలకు ప్రసిద్ధి చెందిన విలాసవంతమైన భారతీయ ఆతిథ్య గొలుసును స్థాపించడానికి తన అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. అయితే నాయర్ తన కుమారులకు వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించిన తర్వాత.. బ్రాండ్ పేరుతో సహా అన్ని ఆస్తులను బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్కు కొడుకులు విక్రయించారు. తండ్రి వారసత్వాన్ని అయితే అందుకున్నారు కాని దానిని విజయవంతంగా నడపలేకపోయారు. దీంతో ఆస్తులను అమ్మేశారు.
దేశవ్యాప్తంగా ఎన్ని లీలా హోటళ్ళు ఉన్నాయి?: ప్రస్తుతం లీలా బ్రాండ్ దేశవ్యాప్తంగా దాదాపు 20 హోటళ్ళు, రిసార్టులు, ప్యాలెస్ లను నిర్వహిస్తోంది, వీటిలో 12 ప్రస్తుతం బెంగళూరులో ఉండగా.. మిగతావి చెన్నై, ఉదయపూర్, జైపూర్, గురుగ్రామ్, ముంబై, కేరళ, హైదరాబాద్ వంటి ప్రదేశాలలో పనిచేస్తున్నాయి. బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ స్క్లాస్ బ్రాండ్ను అంతర్జాతీయంగా విస్తరించాలని యోచిస్తున్నప్పటికీ.. ఈ హోటల్స్ అన్ని పూర్తిగా వారి ఆధీనంలోకి ఇంకా రాలేదు.నాయర్ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలుత ప్రారంభించిన ది లీలా హోటల్, ప్యాలెస్ ఇంకా అసలైన యజమానులైన నాయర్ కొడుకుల దగ్గరే ఉంది. మిగతావన్నీ బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ స్క్లాస్ నిర్వహిస్తోంది..
నాయర్ కుటుంబం నుండి యాజమాన్యాన్ని ఎందుకు తొలగించారు?: 2014లో కెప్టెన్ నాయర్ మరణం తరువాత, కంపెనీ నిరంతర నష్టాలతో ఇబ్బంది పడుతూ దాదాపు రూ.5,000 కోట్ల అప్పులపాలైంది.అయినప్పటికీ అతని కుమారులు వివేక్, దినేష్ నాయర్ రెండేళ్లపాటు జీతాలు తీసుకోకుండా వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొనసాగుతున్న డిఫాల్ట్ల కారణంగా నష్టాల నుండి వ్యాపారాన్ని కాపాడుకోవడానికి కంపెనీ 2018లో బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ స్క్లాస్ కు విక్రయించారు. .
ఆస్తి, బ్రాండ్ రెండు కలిసి అమ్ముడయ్యాయి: ఈ వ్యాపార సామ్రాజ్యం కెప్టెన్ నాయర్ కుమారుల చేతుల్లోకి వెళ్ళిన కేవలం ఐదు సంవత్సరాల లోపు అది పతనావస్థలోకి వెళ్లింది. ఈ లగ్జరీ హోటల్ యొక్క చాలా ఆస్తులు - బ్రాండ్ పేరుతో సహా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కెనడియన్ రియల్ ఎస్టేట్ సంస్థ బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలోని లీలా ప్యాలెస్ ను, అలాగే ఢిల్లీ, ఉదయపూర్, చెన్నై, బెంగళూరులోని హోటళ్లతో పాటు కొనుగోలు చేసింది. బెంగళూరులోని రిసార్ట్, ముంబైలోని ఆస్తికి లైసెన్స్ ఒప్పందాలను కూడా ఈ కంపెనీ పొందింది.
ఈ ఆస్తుల మొత్తం ఒప్పందం విలువ రూ. 3,950 కోట్లు. ఇందులో 206 గదులతో కూడిన గోవా ప్యాలెస్ కూడా ఉంది. నాయర్ వ్యాపార సామ్రాజ్యంలో ఆయన మరణం తరువాత కేవలం గోవా ప్యాలెస్ మాత్రమే రూ. 721 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.అంటే ఒక్కో గదికి దాదాపు రూ. 3.5 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. మిగతా ప్రదేశాల్లో ఉన్న హోటల్స్, రిసార్ట్ లు నష్టాల బాటలోనే పయనించాయి.
లీలా హోటల్స్ IPO సబ్స్క్రిప్షన్ స్థితి ఏమిటీ : స్క్లాస్ బెంగళూరు (లీలా హోటల్స్ IPO) ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం బిడ్ చేయడానికి మూడు రోజుల సబ్స్క్రిప్షన్ విండో ఈరోజు మే 28, 2025న ముగుస్తుంది. సోమవారం, మే 26న ప్రారంభమైన పబ్లిక్ ఇష్యూకు పెట్టుబడిదారుల నుండి నిరుత్సాహకరమైన స్పందన వచ్చింది.
NSE డేటా ప్రకారం, లీలా హోటల్స్ యొక్క 4,66,10,169 షేర్లను రూ.3,500 కోట్ల ఆఫర్ చేయగా అందులో 76,99,164 షేర్లకు ఈ రెండు రోజుల్లో బిడ్లను అందుకుంది. అయితే ఆఫర్లో 4,66,10,169 షేర్లకు బిడ్లను ఆహ్వనించగా అందులో కేవలం 76,99,164 షేర్లకు మాత్రమే బిడ్లను అందుకుంది. దీని ఫలితంగా సబ్స్క్రిప్షన్ రెండవ రోజు, మే 27 ముగిసే సమయానికి కేవలం 17 శాతం సబ్స్క్రిప్షన్ వచ్చింది.
పెట్టుబడిదారుల వర్గాలలో, రిటైల్ పెట్టుబడిదారులు తమకు రిజర్వు చేయబడిన కేటగిరీని 41 శాతం ఓవర్సబ్స్క్రైబ్ చేయడం ద్వారా డిమాండ్లో ముందంజలో ఉన్నారు. దీని తర్వాత 11 శాతం బిడ్లు వేసిన సంస్థాగతేతర పెట్టుబడిదారులు (NIIలు) మరియు 11 శాతం బిడ్లు వేసిన అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు (QIBలు) ఉన్నారు. అయితే నేటితో ఐపీఓ ముగుస్తుండటంతో లీలా హోటల్స్ రూ. 3500 కోట్ల సమీకరణ చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
లీలా హోటల్స్ IPO వివరాలు : లీలా హోటల్స్ IPO అనేది రూ. 2,500 కోట్ల వరకు విలువ చేసే 57.5 మిలియన్ ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ. అలాగే ప్రమోటర్ ప్రాజెక్ట్ బ్యాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ రూ. 1,000 కోట్ల వరకు విలువ చేసే 23 మిలియన్ ఈక్విటీ షేర్లను విక్రయించడంతో ఆఫర్ ఫర్ సేల్ (OFS) గా ఉంది. ఐపీఓ ద్వారా సమీకరించిన రూ. 2,500 కోట్లలో రూ. 2,300 కోట్లు కంపెనీ, దాని సబ్సిడియరీల (ష్లాస్ చాణక్య, ష్లాస్ చెన్నై, ష్లాస్ ఉదయపూర్, TPRPL) రుణాల చెల్లింపునకు ఉపయోగించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనుంది.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications